ఈ మధ్యకాలంలో క్రైం రేట్ ఎక్కువ అయిపోయింది. ఎంత ఎక్కువ అయ్యింది అంటే అది మాటల్లో చెప్పలేనంత ఎక్కువ అయ్యింది. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నప్పట్టి లాక్ డౌన్ లో బాగానే క్రైమ్ రేట్ పెరిగింది. ఇక ఇది అంత పక్కన పెడితే పెద్దపల్లి జిల్లాలో ఓ దారుణం చోటు చేసుకుంది. 

 

ఆ దారుణం వింటే ఎవరైనా సరే షాక్ అయిపోతారు. అలాంటి దారుణ ఘటన ఇది. అంత దారుణమైన ఘటన ఏంటి అని అనుకుంటున్నారా? ఇంకేంటి అండి.. ఓ భార్య అతి కిరాతకంగా తన భర్తని గొంతు నులిమి చంపేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని విఠల్‌నగర్‌లో బుధవారం రాత్రి జరిగింది. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 49 ఏళ్ళ జీదుల రాంబాబు అనే వ్యక్తి గోదావరిఖనికి చెందినవాడు. అయితే మంథని మండలం విలోచవరంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇంకా అతడికి భార్య మంజుల, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల మద్యానికి బానిసైన రాంబాబు రోజూ తాగొచ్చి భార్యను వేధిస్తున్నాడు. రోజు కొట్టి కొట్టి టార్చర్ చేస్తున్నాడు. 

 

దీంతో దంపతుల మధ్య గొడవలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే బుధువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అయితే ఇంటికి వచ్చిన రాంబాబు భార్యతో గొడవ పడడం మొదలు పెట్టాడు.. భర్త వేధింపులు తట్టుకోలేని భార్య మంజుల రాంబాబుని చంపేయాలని నిర్ణయించుకుంది. 

 

దీంతో అతను నిద్రపోతున్న సమయంలో అతడి చేతులు, కాళ్లు కట్టేసి గొంతు నులిమి చంపేసింది. ఉదయాన్నే భర్త అనారోగ్యంతో చనిపోయాడని భార్య మంజుల ప్రచారం చేసింది. అయితే మంజులపై అనుమానం వచ్చిన రాంబాబు తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో అసలు నిజం బయటకు వచ్చింది. ఇంకా విచారణలో భర్తను ఆమె చంపేసినట్టు మంజుల అంగీకరించాడు. దీంతో పోలీసులు ఆమెపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: