మత్తు పదార్థాల కు ఒక్కసారి అలవాటు పడితే ఇంక జీవితాలు కాటికి పోయినట్లే.. అందుకే తల్లి దండ్రులు అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయిన కొంతమంది మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు. యువత అంటే ఏదో ఉడుకు రక్తం తెలియని వయసు అనుకోవచ్చు.. కానీ ఇక్కడ ప్రభుత్వ అధికారిగా పోలీస్ కానిస్టేబుల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఈ డ్రగ్స్ కు బాగా అలవాటు పడి భార్యకు నరకాన్ని చూపించాడు..  భర్త తీరు తో విసిగి పోయిన ఆమె గురువారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

 

 

 


వివరాల్లోకి వెళితే..విశాఖ జిల్లాలో జరిగిన విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి టౌన్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రొంగలి తలుపులునాయుడుకు మూడు నెలల కిందట నాతవరం మండలం వెదుర్లపల్లికి చెందిన చాతుర్య(18) అనే యువతితో వివాహమైంది. ఈ దంపతులు పట్టణంలోని శారదానగర్‌లో నివాసం ఉంటున్నారు. నాయుడుకు అంతకు ముందే పెళ్లయినా మొదటిభార్య విడాకులివ్వడంతో చాతుర్యను రెండో వివాహం చేసుకున్నాడు.ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టిన ఆమెకు చుక్కెదురైంది.. మూడు నెలలకే నరకాన్ని అనుభవించింది.

 

 

 

డ్రగ్స్ అలవాటున్న తలుపులునాయుడు ఉన్మాదిలా ప్రవర్తిస్తూ భార్యను నిత్యం చిత్రహింసలు పెట్టేవాడు. పద్ధతి మార్చుకోవాలని పెద్దలు ఎన్నిసార్లు సూచించిన అతడిలో మార్పు రాలేదు. దీనికి తోడు అదనపు కట్నం కోసం చాతుర్యను వేధించేవాడు. భర్త తీరుతో విసిగిపోయిన ఆమె గురువారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది..కూతురు చనిపోయిందని తెలుసుకున్న అమ్మాయి తల్లి దండ్రులు బందువులు తలుపుల నాయుడుపై పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు వచ్చేసరికి కానిస్టేబుల్‌ నాయుడు డ్రగ్స్ మత్తులో తూలుతూ ఇంట్లోనే ఉన్నాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. చాతుర్య మృతికి కారణమయ్యాడని నాయుడుపై ఎస్ఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: