అక్రమ సంబంధాలు పచ్చటి సంసారా లను కూల్చేస్తాయన్న విషయం తెలిసిందే.. ఒకప్పుడు మగాడు పరాయి స్త్రీ మోజు లో పడి కుటుంబాన్ని వదిలేస్తున్నారు.అందుకే అలాంటి వారికి కోర్టు తగిన భరణాన్ని ఇప్పించి ఎవరి జీవితాల ను వాళ్ళు బ్రతికెలా చేస్తుంది.. కానీ ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు పరాయి మగాడి తోడు కోరుకోని భర్తను , కాపురాన్ని వదిలేస్తున్నారు.. ఇప్పుడు అలాంటి ఘటన ఎదురైంది. భర్త  స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు , భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడు కలిసి ప్లాన్ చేసి చంపేసింది..

 

 


వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన తెలంగాణ లోని జగిత్యాల జిల్లాలో జరిగింది. కరీంనగర్ జిల్లా మక్తపల్లికి చెందిన పాలేటి సంపత్ (45), స్వరూప దంపతులు. సంపత్‌కు స్నేహితుడైన పెంట సాగర్ తరుచూ వారి ఇంటికి వస్తూపోయేవాడు. ఈ క్రమంలోనే స్వరూపతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న సంపత్ పద్ధతి మార్చుకోవాలని భార్యను హెచ్చరించాడు. దీంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి.

 

 

తన అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్న భర్తను చంపేయాలని స్వరూప నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది. దీంతో సాగర్, తన తమ్ముడు చింత రాముతో కలిసి 2017 నవంబర్ 19న జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న దేవాలయ మెట్ల దారిలో సంపత్‌పై బీరు సీసాతో దాడి చేసి చంపేశారు. దీన్ని హత్యగా నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఎలాంటి క్లూ లభించకపోవడంతో పోలీసులు ఈ కేసు సవాలుగా మారింది. చివరిగా సెల్‌ఫోన్ సిగ్నల్ ద్వారా అసలు హంతకుడు సాగర్ అని తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.. ఆ హత్యకు సహకరించిన స్వరూపను కూడా అరెస్ట్ చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: