మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలను ముందుకు తీసుకొస్తుంది.. నిర్భయ లాంటి అమాయకులు తమ మాన, ప్రాణాలను కోల్పోతున్నారు. కానీ మృగాళ్ల కామ దాహం ఎక్కడా మారలేదు.విషయానికొస్తే..కానిస్టేబుల్ కు ఓ మహిళ అప్పు ఇచ్చింది.అయితే ఇచ్చిన అప్పు తిరిగివ్వమని అడిగిన మహిళపై స్నేహితుడితో కలిసి అత్యాచారానికి యత్నించాడు. ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో వెలుగు చూసింది. 

 

 


వివరాల్లోకి వెళితే.. వెంకట రాజేష్ అనే కానిస్టేబుల్ ఒంగోలు తాలూకా పోలీస్‌ స్టేషన్‌ లో రైటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి ఒంగోలు దిబ్బల రోడ్డుకు చెందిన మహిళ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమం లోనే ఆమెతో శారీరక సంబంధం పెట్టుకుని నగ్నవీడియోలు, ఫోటోలు తీశాడు. ఆ సంబంధాన్ని అడ్డం పెట్టుకుని రాజేష్ ఆమె నుంచి రూ.35లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. ఎన్ని రోజులకీ అతడు డబ్బు తిరిగివ్వక పోవడంతో ఆ మహిళ నిలదీయగా న్యూడ్ వీడియోలు, ఫోటోలతో బెదిరించాడు. డబ్బుల మాట వస్తే ఇవ్వన్నీ ఇంటర్నెట్ లో పెడతానని హెచ్చరించాడు. 

 

 

 

అయితే, ఆమె డబ్బులు ఇవ్వకుంటే అందరి లోనూ పంచాయతీ పెడతానని ఆ మహిళ హెచ్చరించడంతో రాజేష్ కంగారు పడ్డాడు. ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకుని ప్లాన్ వేశాడు. ఈ నెల 8వ తేదీన అప్పు చెల్లిస్తానని చెప్పిన ఆమెను తన ఫ్రెండ్ అయిన ఆర్మీ మాజీ ఉద్యోగి నల్లూరి సుధాకర్ ఇంటికి పిలిపించాడు. అక్కడ ఇద్దరూ కలిసి ఆమెను బంధించి అత్యాచారానికి యత్నించాడు. ఆ కామాంధుల బారి నుంచి తప్పించుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది. తన దగ్గర డబ్బులు తీసుకొని అడిగితే ఇలా చేశారని చెప్పింది.. బాధితురాలు ఇచ్చిన పిర్యాదు తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిదితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: