ఈ మధ్య కాలంలో ప్రేమించడం సహజీవనం చేయడం  సరదా అయి పోయింది.. శారీరక సుఖం పొందడం కోసం ఆడ ,మగ పెట్టుకున్న పేరు సహజీవనం. క్షణకాల సుఖం పొందడం కోసం ఎన్నో మోసాలకు నేరాలకు పాల్పడుతున్నారు.. ఇప్పుడు పెళ్లిళ్లకు పెర్ఫెక్ట్ మా వేదిక అంటూ రోజుకో మ్యాట్రిమోనీలు  దర్శనమిస్తున్నాయి. అందులో ఫేక్ డిటైల్స్ పెట్టడం అమ్మాయిలకు వల వేసి పట్టడం, వారితో సహజీవనం చేయడం పెళ్లి మాట రాగేనే అడ్రెస్స్ లేకుండా పారిపోవడం కామన్ అయిపోయింది.. అలాంటి ఘటనే ఇప్పుడు వెలుగు చూసింది..

 

 

 

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కిషన్ బాగ్ లో  జరిగింది.కిషన్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొంతకాలం క్రితం భర్త తో విడాకులు తీసుకుంది. రెండో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇటీవలే తన వివరాలను ఓ మ్యాట్రిమోనీ వెబ్‌ సైట్‌లో అప్‌లోడ్ చేసింది. అది చూసిన యాసరుల్లా (25) అనే యువకుడు ఆమెకు ఫోన్‌ చేసి పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేద్దామని ఒప్పించాడు. 

 

 

 

అతని వివరాలు ఆమెకు నచ్చడంతో అతని కోరికలు సరే అంది.దీన్ని అవకాశంలో తీసుకున్న అతడు ఆమె పై అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు కలిసి ప్రేమ పక్షుల్లా జంట నగరాల్లో తిరిగారు.. ప్రైవసీ పేరు తో ఏకాంతంగా కలిశారు.అన్నీ సరదాలు తీరడంతో
 ఇంకెంతకాలం సహజీవనం చేద్దాం... వెంటనే పెళ్లి చేసుకో అని ఆమె కోరడంతో తప్పించుకుని తిరుగుతున్నాడు. అతడి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో మోస పోయానని గ్రహించిన బాధితురాలు బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.ఇలాంటి ఫేక్ మ్యాట్రిమోనీలను నమ్మి మోసపోవద్దని మహిళలకు పోలీసులు హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: