ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. అయితే కులాలు వేరు కావడంతో అమ్మాయి తరపు బంధువులు అమ్మాయికి మాయ మాటలు చెప్పి పెళ్లి చేశారని కక్ష్య పెంచుకొని వరుడి కుటుంబంపై దాడి చేశారు.. మనుషులం అనే సంగతి కూడా పూర్తిగా మరచి పోయి క్రూర మృగాలు గా దొరికిన వాళ్ళను దొరికినట్లు విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. కొద్ది రోజుల క్రితం ఇద్దరు ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు.వారి కూతురిని నమ్మించి డబ్బు కోసం ఇదంతా చేశారని అబ్బాయి కుటుంబంపై అమ్మాయి బంధువులు దాడి చేశారు.

 

 

 

వివరాల్లోకి వెళితే.. ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడి కుటుంబసభ్యులపై అమ్మాయి కుటుంబీకులు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ సంఘటన మాడుగులపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చింతగూడేం గ్రామానికి చెందిన ఓ యువకుడు, యువతి ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులక్రితం అమ్మాయి తల్లిదండ్రుల అనుమతి లేకపోయినా వివాహం చేసుకున్నారు. దీంతో యువకుడి కుటుంబసభ్యులపై అమ్మాయి తరపు బందువులు దాడి చేశారు.

 

 

 


కర్రలు, ఇనుప రాడ్లు,పెద్ద రాళ్ల తో విచక్షణా రహితం గా కొట్టారు. ఈ దాడిలో యువకుడి తల్లికి తీవ్ర గాయాలు కావడం తో పాటుగా రెండు చేతులు విరిగి పోయాయి. ప్రస్తుతం ఆమె మిర్యాల గూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.. వారిని కూడా స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.వరుడి కుటుంబ సభ్యులు చేసిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమ్మాయి తరపు బంధువులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.. ప్రేమించుకొని పెళ్లి చేసుకు న్నందుకు అబ్బాయి కుటుంబం పై ఇలా చేయడం సరి కాదని స్థానికులు మండి పడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: