ప్రేమ పేరుతో అమ్మాయిలను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మృగాళ్లు..అమ్మాయిలు డైరెక్ట్ గా పడుకోవాలి అంటే ఎవ్వరూ ఒప్పుకోరు.. దాంతో ప్రేమ అనే ఆయుధాన్ని వాడుతున్నారు.. ఈ మధ్య కాలంలో లవర్ లేని వాడు వెస్ట్ అనే టాక్ వినపడుతుంది..ఉన్నవాళ్లు ఇలా నమ్మించి కోరికలు తీరాక పారిపోతున్నారు.. విషయానికొస్తే.. ప్రేమ పేరుతో ఓ యువకుడు అమ్మాయికి దగ్గరయ్యాడు.. వద్దన్నా వినకుండా కోరికలు తీర్చుకున్నాడు.చివరికి పారిపోయాడు.. 

 

 

 

వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది.. చిత్తూరు జిల్లా మదనపల్లి  పట్టణంలోని ఆంజనేయస్వామిగుడి వీధికి చెందిన యువతి (27), ఇదే ప్రాంతానికి చెందిన నయాబ్‌షాజద్‌ ఆలీ (25) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఆమెను ఏకాంతంగా కలుసుకున్న ఆలీ ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అని బలవంతపెట్టి లైంగికంగా అనుభవించాడు. తర్వాత ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకురాగా మొహం చాటేశాడు. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేశాం.. ఆ కథ ముగిసిందంటూ ప్లేటు పిరాయించాడు. ఎన్నిసార్లు కోరినా అతడు పెళ్లి ఊసెత్తకపోవడంతో యువతి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నయాబ్‌షాజద్‌ ఆలీపై రేప్, చీటింగ్ కేసులు నమోదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.. 

 

 

 

ఇలాంటి మరో ఘటన కర్నూల్ లో చోటు చేసుకుంది. పగిడ్యాల మండలం బీరవోలు గ్రామానికి చెందిన యువతి సంకిరేణిపల్లె గ్రామానికి శివ దుర్గాప్రసాద్‌ ప్రేమించుకున్నారు.మూడేళ్లు చెట్టా పట్టలేసుకొని తిరిగారు.. ప్రేమ కాస్త ముదరడంతో ఇద్దరి శారీరకంగా దగ్గరయ్యారు. అంతేకాదు పేరుతో నమ్మించి ఆమె నుంచి అనేకసార్లు డబ్బులు తీసుకున్న శివ గుట్టుగా మరొక యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు ముచ్చుమర్రి పోలీస్‌‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో శివ దుర్గాప్రసాద్‌ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: