ఒక్కోసారి చిన్న చిన్న సంఘటనలే దారుణమైన నేరాలకు దారి తీస్తాయి. తమిళనాడులో అలాగే జరిగింది. ప్రేమ జంట చేసిన చిన్న పొరపాటు.. ఓ పసి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా ఊతకులిలో ఓ ప్రేమ జంట ఉంది. ప్రేమ జంట ప్రేమ కలాపాలు కాస్తా కామ కలాపాల్లోకి దిగాయి. రోజూ ఓ రహస్య ప్రాంతంలో కలుసుకుని ఉడుకు వయస్సు తాపం తీర్చుకోవడానికి అలవాటుపడ్డారు.

 

 

ఓరోజు యథాప్రకారం ఆ ప్రేమ జంట కామకలాపంలో దిగింది. ఫుల్ జోష్ మూడ్‌లో ఎంజాయ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా ఓ 8 ఏళ్ల బాలుడు చూశాడు. దాంతో ఆ జంట కంగారుపడిపోయింది. గబగబా షాక్ నుంచి తేరుకుని.. ఆ పిల్లవాడిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బతిమాలుకుంది. ఆ పిల్లవాడు కూడా సరే అన్నాడు.

 

 

అయినా ఆ ప్రేమ జంటలో అనుమానం పోలేదు. ఈ పిల్లోడు ఎవరికైనా విషయం చెప్పేస్తే ఇంకేమైనా ఉందా అనుకున్నారు. అంతే.. ఆ పసివాడి ఉసురు తీయాలని నిర్ణయించుకున్నారు. తాము ఏకాంతంగా కలిసుకున్న వేళ చూశాడని 8 ఏళ్ల బాలున్ని ఆ ప్రేమజంట హతమార్చింది. ఉదయం అనగా బయటకు వెళ్లిన పసివాడు సాయంత్రానికి కూడా ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు కంగారు పడ్డారు.

 

 

అలా వెదుకుతున్న వారికి ఓ కొలనులో పిల్లవాడు శవమై కనిపించాడు. మొదట కాలుజారి పడి చనిపోయాడేమో అనుకున్నారు. కానీ మెడపై గాయాలు ఉండటంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. చివరకు ఆ విచారణలో ఆ ప్రేమ జంట తామే ఆ ఘోరం చేశామని ఒప్పుకుంది. కటకటాల పాలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: