కొన్ని ఘటనలు ఆశ్చర్యాన్ని కల్గిస్తాయి. అలాంటి కొన్ని ఘటనల్లోనే ఈ నవ వధువు ఘటన కూడా. సరిగ్గా నెల రోజుల క్రితం అత్తారింటికి వచ్చిన ఓ నవ వధువు మెట్టినింటికి కన్నమేసి పారిపోయిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళిపోయినా భార్య కోసం పుట్టింటి వాళ్లకు ఫోన్ చేస్తే అదిరిపోయే షాక్ ఇచ్చాడు మామ. 

 

ఇంకా ఈ ఘటన గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్‌ కు చెందిన జయేష్ రాథోడ్‌కి మంచి పెళ్లి సంబంధం ఉంటే చూడమని అతని బంధువు మను రాథోడ్ తన స్నేహితుడు మణిలాల్‌కి చెప్పాడు. దీంతో మణిలాల్ రాజస్థాన్ కు చెందిన కళావతి ఖరాదీ, ఆమె తండ్రి సంజీత్ ఖరాదీ సహా మరో వ్యక్తి మోహన్‌లాల్ భగోరాతో కలసి జయేష్ ఇంటికి చేరారు. 

 

ఒకరినొకరు ఇష్టపడటంతో పెద్దలు వారికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇంకా ఈ నేపథ్యంలోనే జయేష్ అతని కుటుంబ సభ్యులు రాజస్థాన్‌లోని కళావతి ఇంటికి  వెళ్ళగా తన పరిస్థితి బాలేదు అని కేవలం తనకు రూ.1.55 లక్షలు అప్పుగా ఇవ్వాలని నెల రోజుల్లో ఇచ్చేస్తా అంటూ పెళ్లి కూతురు తండ్రి అడిగాడు. దీంతో ఆ పెళ్లి కొడుకు ఇచ్చాడు. 

 

అనంతరం జయేష్, కళావతి పెళ్లి జరిగింది. ఇంకా మెట్టినింటికి వచ్చి సరిగ్గా నెల రోజులు అయ్యిందో లేదో అప్పుడే మెట్టినింటిని పూర్తిగా సర్దేసింది. నగలు, ఇతరు విలువైన వస్తువులతో పారిపోయింది. ఇంకా ఇంట్లో కనిపించని భార్య పుట్టింటికీ వెళ్ళింది అని ఫోన్ చేస్తే భర్తకు ఊహించని షాక్ తగిలింది. అది విన్న భర్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు. 

 

తన కూతురు ఇంకెప్పటికీ అక్కడికి రాదని పెళ్లి కూతురు తండ్రి చెప్పాడు. అంతేకాదు డబ్బులు, నగల కోసమే పెళ్లి చేసుకున్నట్లు చెప్పడంతో షాక్‌కి గురయ్యాడు. ఈ విషయం ఎక్కడైనా చెప్తే చంపేస్తా అని బెదిరించాడు. దీంతో వరుడు పోలీసులను ఆశ్రయించి పెళ్లి పేరుతో డబ్బు, నగలు దోచుకున్నారని ఫిర్యాదు చేశాడు. ఇంకా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: