ప్రేమ అనేది యువతను ఒక మాయ లోకంలోకి తీసుకెళ్తుంది..  ప్రేమ పేరు తో కొందరు అవసరాలను తీర్చుకుంటే.. మరి కొందరు మాత్రం ప్రేమను దక్కించుకోవడానికి ఎంత వరకైనా వెళ్తారు.. అవసరమైతే అన్నీ వదిలేసుకుంటారు.. ఇక్కడ ఓ జంట ప్రేమించుకొని పారి పోయారు. యువతిని నమ్మించి తీసుకెళ్లారని అబ్బాయి కుటుంబం పై అమ్మాయి తరపు బంధువులు దాడి చేశారు.. కేవలం దాడి అంటే కుటుంబం మొత్తాన్ని నిప్పు పెట్టారు. ఈ ఘటన తమిళనాడు లో వెలుగు చూసింది.. వేలూర్‌ జిల్లా జోలార్‌పేట సమీప మండలవాడి కామ రాజపురానికి చెందిన తిరుపతి అనే యువకుడు, చిన్న మండలవాడికి చెందిన ఓ యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 

 

 

 

వీరి ప్రేమను ఇరు కుటుంబాల వారు వ్యతిరేకించారు. దీంతో శుక్రవారం ఈ ప్రేమ జంట పారిపోయింది. అమ్మాయికి మాయ మాటలు చెప్పి మోసం చేశారని ఆగ్రహించిన యువతి కుటుంబ సభ్యులు, బంధువులు సుమారు 50 మందికి కలిసి శనివారం యువకుడి ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి వస్తువులన్ని చిందర వందర చేసి నిప్పు పెట్టారు. వారిని అడ్డుకున్న ముగ్గురు స్థానికుల పైనా దాడి చేశారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న వాణి యంబాడి ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటల ను అదుపు చేశారు. 

 

 


ఈ ప్రమాదం లో రూ.లక్ష నగదు, 20 సవర్ల బంగారు నగలు, విలువైన వస్తువులు అగ్నికి ఆహుతైనట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 20 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దారుణానికి పాల్పడిన యువతి కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని యువకుడు కుటుంబం మరియు బందువులు డిమాండ్ చేస్తున్నారు.. ఈ ఘటన లో ప్రాణ నష్టం ఎక్కడ జరగ లేదని పోలీసుల విచారణలో తేలింది..

మరింత సమాచారం తెలుసుకోండి: