నేటి స‌మాజంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు ఏ స్థాయిలో జ‌రుగుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నిమిషానికోసారి తనని తాను చూసుకొని బతికున్నానని నిర్ధారించుకునే పరిస్థితుల్లో ఆడ‌వారు ఉన్నారంటే.. ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్న‌మో అర్థం చేసుకోవ‌చ్చు. ప్రభుత్వాలు ఎన్ని నూతన చట్టాలు తీసుకొస్తున్నా.. కఠిన శిక్షలు విధిస్తున్నా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఈ క్ర‌మంలోనే సమాజంలో ఆడవారికి రక్షణ కరువైంది. పోలీసులున్నారు. చట్టాలున్నాయి. కానీ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. 

 

ఆడది ఒంటరిగా రోడ్డు మీదకు వెళ్లి క్షేమంగా ఇంటికి చేరడమే గగనమైపోతోంది. అస‌లు అత్యాచార ఘటనలు లేకుండా ఒక్క రోజైనా గడవటం లేదంటే.. కామాంధులు ఎంత‌లా బ‌రితెగిస్తున్నారో స్ప‌ష్టం అవుతోంది. ఇక తాజాగా ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 40 మ‌హిళ‌ల‌పై ఆత్యాచారం చేసిన ఓ సీరియల్ రేపిస్ట్ పోలీసుల‌కు చిక్కాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..  నైజీరియాలోని డాంగోరా పట్టణానికి చెందిన ఓ యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి గదిలోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.

 

అయితే ఇంత‌లోనే ఇంటికి వచ్చిన యువతి తల్లి.. కేకలు విని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో వెంట‌నే పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం అత‌న్ని పోలీస్ స్టేష‌న్‌కు తీసుకువెళ్లి..  విచార‌ణ చేప‌ట్ట‌గా షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.  అతడు దాదాపు 40 మంది మహిళలపై రేప్ చేసినట్లు చెప్ప‌డంతో.. అవాక్ అవ్వ‌డం పోలీసుల వంతు అయింది. అంతేకాదు, 10ఏళ్ల వయసున్న బాలికల నుంచి 80ఏళ్లు పైబడిన వృద్ధ మహిళలపైనా అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అయితే స‌ద‌రు కామాంధుడి చేతిలో బలైపోయిన మహిళలు పరువు పోతుందన్న భయంతోనే ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఇక ఏడేళ్లుగా ప్రజలకు కంటికపై కునుకు లేకుండా చేస్తున్న సీరియల్ రేపిస్ట్ అరెస్ట్ అవ్వ‌డంతో అంద‌రూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: