పదవి వ్యామోహంలో చాలా మంది దారుణానికి పాల్పడుతున్నారు.. పదవిలో ఉన్నారని ఓర్వలేని వాళ్ళు కూడా నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు .. ఎందుకంటే అది మనిషి నైజం..ఇకపోతే కుటుంబ కలహాల వల్ల మాజీ సర్పంచ్ భర్తను, కొడుకును అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..ఉపాధి హామీ పనుల్లో పొలాల్లో చేపట్టిన డొంకరోడ్డు విషయంలో తలెత్తిన వివాదం రెండు ప్రాణాలు బలితీసుకుంది. 

 

 

 

అయితే స్థానిక రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న పొలం యజమానులు ఏకంగా గ్రామ మాజీ సర్పంచ్ భర్త, ఆమె కొడుకుని దారుణంగా కాల్చి చంపేశారు. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో తుపాకీతో కాల్పులు జరపడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ దారుణ ఘటన యూపీలోని సంబల్ జిల్లాలో జరిగింది.బెజోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేపూర్ శంషోయ్ మాజీ సర్పంచ్ భర్త, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు చోటేలాల్ దివాకర్, అతని కుమారుడు సునీల్ దారుణ హత్యకు గురయ్యారు. ఉపాధి హామీ పథకం నిధులతో పొలంలో నిర్మిస్తున్న డొంకరోడ్డు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దాంతో ఇద్దరి మద్య బలంగా వాగ్వాదం చోటు చేసుకుంది.. 

 

 


తీవ్ర ఆగ్రహానికి గురైన వ్యతిరేక వర్గం ఒక్కసారిగా దివాకర్, అతని కొడుకు సునీల్‌పై కాల్పులు జరిపింది. దీంతో తండ్రీకొడుకులు అక్కడే కుప్పకూలిపోయారు. ఈ ఘటన మొత్తం వీడియోలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడు సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు కావడంతో ఆ పార్టీ శ్రేణులు భారీగా గ్రామానికి చేరుకున్నారు. దీంతో గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులను భారీగా మోహరించారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: