ప్రపంచంలో సైన్స్ ఎంత పెరిగిన కూడా మూఢ నమ్మకాలు మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. మంత్రాలకు చింత కాయలు రాలతయనే అఫోహలో చాలా మంది బ్రతుకున్నారు.. చేత బడులు క్షుద్ర పూజలు అని చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు.. ఇక్కడ మూఢనమ్మకాలతో కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తూ దారుణాలకు తెగబడుతున్నారు. చేతబడి చేశారన్న అనుమానంతో అమాయకులను అతి కిరాతకంగా అంతమొందిస్తున్నారు. తన కూతురు చని పోవడానికి అత్తే కారణమని భావించిన అల్లుడు ఆమె తల నరికేసిన అత్యంత అమానుష ఘటన తాజాగా వెలుగు చూసింది. 

 

 


వివరాల్లోకి వెళితే.. దారుణ ఘటన ఒడిశా లోని మయూర్ ‌భంజ్ జిల్లా లో చోటు చేసుకుంది. జిల్లా లోని బారిపదా ఏరియా నౌషాహి గ్రామానికి చెందిన బుధురాం సింగ్ కుమార్తె మూడు రోజుల కిందట మరణించింది. తన మేనత్త చంపా సింగ్ చేతబడి చేయడం వల్లే తన కూతురు చని పోయిందని కోపం పెంచుకున్న బుధురాం దారుణానికి పాల్పడ్డాడు. ఇంటి వరండాలో నిద్రిస్తున్న అత్తని బయటకు లాగి కిరాతకంగా చంపేశాడు. గొడ్డలి తో నరికి దారుణంగా హత్య చేశాడు.

 

 

 

ఆమె తలను మొండెం నుంచి వేరుచేసి కండువాలో చుట్టి బయల్దేరాడు. సుమారు 13 కిలోమీటర్లు నడిచి నేరుగా పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నాడు. టవల్‌లో ఉన్న తల తీసి తానే హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. ఒక్కసారిగా షాక్‌కి గురైన పోలీసులు వెంటనే తేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి వెళ్లి ఆమె మొండెం స్వాధీనం చేసుకున్నారు.తన కూతురు చనిపోవడానికి అత్త చేతబడి చేయించదని అనుమానంతో అత్తను బయటకు లాగి గొడ్డలితో నరికేశాడు.. ఆ సమయంలో చాలా మంది చూస్తూ ఉన్నా కూడా ఎవరు ఆపే ప్రయత్నం చేయలేక పోయారు..ప్రస్తుతం ఈ దారుణ సంఘటన ఒడిశా రాష్ట్రాన్ని కదిలించి వేస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: