భారత దేశం అభివృద్ధి దేశాలతో పోటీ పడుతూ ఒక్కొక్క అడుగు అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది. టెక్నాలజీని ఉపయోగించడంలో ప్రభంజనాలను సృష్టిస్తుంది. జనం మాత్రం ఇంకా కట్టు బాట్లు, కులాలు మతాలు అంటూ కొట్టుకు చస్తున్నారు. పరువు హత్యలంటూ కొందరు తల్లిదండ్రులు తమ కన్నబిడ్డల్నే పొట్టన పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఓ ఘటనే చోటు చేసుకుంది. ప్రేమించిన పాపానికి అతను చచ్చి బ్రతికాడు. కొద్దీ రోజులు ఇద్దరు కలిసి తిరిగారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోయారు.
వివరాల్లోకి వెళితే.. ఒకే కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అదే అతడు చేసిన మహా పాపం అయ్యింది. కుల పెద్దలు ఆ ప్రేమికుడిని చిత్రహింసలకు గురి చేశారు. ఊరందరి ముందే తీవ్రంగా కొట్టారు. బలవంతంగా మూత్రం కూడా తాగించారు. ఈ అమానుష ఘటన రాజస్థాన్లోని శిరోహిలో జూన్ 11న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.రాజస్థాన్ లోని శిరోహి జిల్లాకు చెందిన ఓ యువకుడు అదే ప్రాంతానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు.
ఆ ప్రేమే తన మెడకు చుట్టుకుంది. ఇద్దరు ఒకే కులానికి చెందిన వారే. అయిన వారి కుల పెద్దలకు వారి ప్రేమను నిరాకరించారు. అంతటితో ఆగకుండా... యువకుడిని దారుణంగా కొట్టారు. రోడ్డు పై ఈడ్చుకెళ్లారు. షూలో మంచి నీరు పోసి తాగించారు. ఆ తర్వాత ఓ సీసాలో మూత్రం తీసుకువచ్చి బలవంతంగా తాగించారు. ఈ ఘటనకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చలించి పోయారు. ఈ ఘటన అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Watch: panchayat forces boy to drink urine for falling in love in rajasthan, video goes viralhttps://t.co/frmyQDDrHs@sangpran pic.twitter.com/c35fqbyCvH
— Free press Journal (@fpjindia) June 16, 2020
Rajasthan crime: Six people arrested for forcing boy to drink urine from a shoe, reports @sangpran https://t.co/fSBFeOzOmt
— Free press Journal (@fpjindia) June 17, 2020