మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలను అమలు లోకి తీసుకొస్తున్న కూడా రోజూ ఏదొక సమస్యల్లో చిక్కుకుంటూ వస్తున్నారు. అంతేకాదు కామాంధుల పశువాంఛనకు బలైపోతున్నారు. అయినా కూడా హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. తన కోరిక తీర్చ లేదని ఓ కామాంధుడు ఆమె పై బ్లేడుతో గొంతుకోసేందుకు యత్నించాడు. ఆ దుర్మార్గుడి దగ్గర నుంచి తప్పించుకొని బయట పడింది. దారుణంగా గాయాలు కావడం తో ఆసుపత్రి పాలైంది. 

 

 

 

వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా లో చోటు చేసుకుంది. జిల్లా లోని గుడివాడ పట్టణంలోని ధనియాలపేటకు చెందిన వివాహిత రాధ పై అదే ప్రాంతానికి చెందిన మచ్చా ప్రసాద్ కన్నేశాడు. కొద్ది కాలంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. ఎవరు లేకున్న సమయం చూసి  ఇంట్లోకి చొరబడిన ప్రసాద్ కామ కోరికలు తీర్చాలంటూ ఆమెను లైంగికంగా వేధించాడు. శారీరక సంబంధానికి ఒప్పుకోక పోతే గొంతుకోసి చంపేస్తానంటూ గాజు సీసా పెంకుతో బెదిరించాడు. భయపడి పోయిన వివాహిత అతని నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

 

 

 

బాధితురాలు వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసే పనిలో పడ్డారు. అయితే తన పై పోలీసులకు ఫిర్యాదు చేసిందని ప్రసాద్ రాధ పై కక్ష్య పెంచుకున్నాడు.  దాంతో బ్లేడు తో వివాహిత పై దాడి చేశాడు. ఆమె గొంతుకోసేందుకు యత్నించాడు. వివాహిత మెడపై బ్లేడుతో కోసేశాడు. తీవ్ర గాయాలపాలైన వివాహిత ఆస్పత్రి పాలైంది. తన తల్లి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సీరియస్‌గా తీసుకో లేదని.. అందుకే దాడికి తెగబడ్డాడని బాధితురాలి కుమారుడు ఆరోపిస్తున్నాడు. పరిస్థితి తీవ్రంగా మారడం తో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. రేపు ఉదయం అతన్ని కోర్టు లో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: