బుధవారం కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని జగ్గయ్య పేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది మృతి చెందగా.. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఎర్రు పాలెం గోపవరం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. 

 

 

 

వివరాల్లోకి వెళితే.. గోపవరం గ్రామం నుంచి దాదాపు 25 మంది మంగళ వారం ట్రాక్టర్‌లో కృష్ణా జిల్లా వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దైవదర్శనానికి వెళ్లారు. ఆ రాత్రికి  ఆలయంలోనే విశ్రాంతి తీసుకున్నారు. నిన్న ఉదయం మొక్కులు ముగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణం చేసిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వేగంగా వచ్చిన లారీ, టాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

 

 


ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుల ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన మృతులంతా తెలంగాణ జిల్లాకు చెందిన వారు కావడం తో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

 

 

 

అంతేకాదు ప్రమాదం లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అవసరమైన సహాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమం గా ఉందని వైద్యులు వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: