సమాజంలో నానాటికి మానవతా విలువలు దిగజారిపోతున్నాయి. కంటికి రెప్పలా ఉండాల్సిన ఓ తండ్రే తన కూతురికి కడుపు చేసి మానవత్వానికి మాయని మచ్చలా నిలిచాడు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇష్టమొచ్చినప్పుడల్లా కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం బయటకి చెప్తే... అందర్నీ చంపేస్తానని బెదిరించాడు. చివరకు ఆ అమ్మాయి గర్భం దాల్చడంతో విషయం బయటపడింది. ఇకపోతే ఈ దారుణ సంఘటన మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ ‌లో జరిగింది ఈ దారుణం.

 

 

ఇక ఈ విషయం పై పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన వ్యక్తి (34) ఆరేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. సూరారం శివాలయ నగర్‌లో నివాసం ఉంటూ  పెయింటర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, కుమార్తె (14), కుమారుడు ఉన్నారు. కొన్ని నెలల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి ఒంటరిగా ఉన్న తన కూతుర్ని బెదిరించి అత్యాచారానికి తెగబడ్డాడు. జరిగిన విషయం బయటకి చెప్తే తనని చంపుతానని బెదిరించాడు.  అలా వీలు దొరికిన ప్రతి సారి కుమార్తె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

 


అయితే కొన్ని రోజుల కు ముందు కుమార్తె తీవ్ర మైన కడుపు నొప్పితో బాధపడుతుంటే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని చెప్పారు. దీంతో ఆమెని నిలదీయగా అసలు విషయం బయటపడింది. అయితే ఈ విషయం ఎవరికైనా చెప్తే భార్యని కూడా చంపుతానని బెదిరించడం తో ఆమె గుట్టు బయటకి చెప్పలేదు.  అయితే కరోనా ప్రభావం వలన ఆమెకు అబార్షన్ చేయించడానికి వాళ్ళకి వీలు పడలేదు. కొన్నాళ్ల తర్వాత బాలికకు 5 నెలలు గర్భం రావడంతో స్థానికులు ప్రశ్నించగా అసలు గుట్టు రట్టయింది. స్థానికులు ఆ తండ్రిని స్తంబానికి కట్టేసి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: