చట్టాలు ఎన్ని వచ్చినా ఆడ పిల్లను ఆట బొమ్మలానే చూస్తున్నారు కొంత మంది దుర్మార్గులు...శిక్షలు ఎంత కటినంగా మారిన కొంత మంది ప్రబుద్ధులు మరాడంలేదు .. స్కూల్ కి వెళ్ళిన చిన్న పిల్ల దగ్గర నుంచి మొదలు ఎవర్ని వదలకుండా నరకం చూపిస్తున్నారు. ఓ 15 ఏళ్ల బాలిక స్నానం చేస్తుండగా దొంగచాటుగా  వీడియో తీసి, అది అమ్మాయి కి చూపి లైంగిక వేధంపులకు పాల్పడ్డారు. తాము చెప్పినట్టు చెయ్యకపోతే నగ్నంగా తీసిన వీడియో ను సామాజిక మాధ్యమాలలో  విడుదల చేస్తామని బెదిరించారు. ఈ దారుణమైన ఘటన తమిళనాడు లో చోటు చేసుకుంది...

 


ఇక పూర్తి వివరాలలోకి వెళితే... తమిళనాడు కి చెందిన ఓ యువతి స్నానం చేస్తుండగా ముగ్గురు యువకులు రహస్యంగా వీడియో ను  తీశారు. తర్వాత ఆ వీడియోను ఆ యువతికి చూపించి తమ లైంగిక కోర్కెలను తీర్చాలని లేకపోతే ఈ వీడియోను సామాజిక మాధ్యమాలలో పెట్టి వైరల్ చేస్తామని బెదిరింపులకు దిగారు. సదరు యువతి వాళ్ళని ఎంతగా ప్రాధేయపడ్డా మృగాళ్ల వారి కామ వాంఛకు బలి కావాల్సిందే అని ఆజ్ఞాపించారు. నిస్సహాయురాలై నా ఆ యువతి ఏమి చేయాలో పాలుపోక ఎవరిని సహాయం ఎవరిని సహాయం అడగాలో  తెలియక వారి కామ వాంఛకు బలి ఇవ్వడం ఇష్టం లేక వారి చెప్పిన పని చేయలేక ఎంతో బాధపడి కుంగి ఆత్మ స్థైర్యం కోల్పోయి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నది.

 


మంటల్లో ఉన్న యువతి అరుపులు విన్న వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ,స్థానికులు యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.కానీ అప్పటికే సదరు యువతి శరీరం 90 శాతానికి పైగా కాలిపోయింది. యువతి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన యువకులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: