వైజాగ్ లో  కలకలం సృష్టించిన దివ్య హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.. నమ్మిన వారి చేతిలో మోసపోయి చిత్రహింసలకు గురై ప్రాణాలు కోల్పోయిన దివ్య కేసులో ఎన్నో దారుణాలు, మరెన్నో కోణాలు వెలుగుచూస్తున్నాయి. విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుండటంతో పోలీసులు షాకవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో పేద కుటుంబంలో పుట్టిన దివ్య చిన్నతనంలోనే తల్లి, తమ్ముడు, అమ్మమ్మ హత్యకు గురవడంతో విశాఖ నగరంలోని ఎన్‌ఏడీ కూడలి వద్ద ఉండే గీత వద్దకు చేరింది. దివ్య అందాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న గీత మాయమాటలతో ఆమెను వ్యభిచారంలోకి దించి డబ్బు సంపాదించింది. 

 

 

అయితే.. అక్కడ నరకాన్ని భరించలేక కొద్ది నెలల తర్వాత దివ్య తప్పించుకుని స్వగ్రామానికి వచ్చేసింది. తర్వాత ఆమెకు ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన వీరబాబుతో బంధువులు వివాహం చేశారు.అయితే అతను కొద్దీ రోజులు బాగానే చూసుకున్నాడు.తర్వాత వ్యభిచారం చేసిందని తెలుసుకున్న భర్త ఆమెను డబ్బుల కోసం వేధించేశాడు. జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసైన అతడు దివ్య మళ్లీ వైజాగ్ తీసుకొచ్చి గీతకు అప్పగించాడు. ఆమెతో వ్యభిచారం చేయించగా వచ్చే సంపాదనలో కొంత భాగం తనకు పంపించాలని ఒప్పందం చేసుకున్నాడు. గీత వద్దే కొద్దిరోజుల పాటు ఉన్న దివ్య అక్కడి నుంచి అక్కయ్యపాలెంకు చెందిన వసంత అలియాస్ జ్యోతి వద్దకు చేరింది. 

 

 


దివ్యతో రోజంతా వ్యభిచారం చేయిస్తూ వచ్చే సొమ్మును వసంతతో పాటు గీత, ఇతరులు పంచుకునేవారు. తమ శరీరాలతో వ్యాపారం చేస్తూ తనకు తక్కువ డబ్బులు ఇస్తుండటంతో దివ్య ఎదురు తిరిగింది. తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వేరు కుంపటి పెట్టుకుంటానని బెదిరించడంతో ఆరు రోజుల పాటు చిత్రహింసలు చేసి చంపేశారు.వసంత, గీతను ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.ఈ విచారణలో అసలు హంతకులు ఎవరనే విషయాన్ని తెలుసున్న పోలీసులు షాక్ కు గురయ్యారు.

 

 

అసలు విషయానికొస్తే.. కోసం దివ్య ఎదురుతిరగడంతో వసంత కోపంతో రగిలిపోయింది. అందంగా ఉందన్న గర్వంతోనే తనకు ఎదురుతిరిగిందని.. ఆమెని అంధవిహీనంగా మార్చాలని నిర్ణయించుకుంది. గదిలో పెట్టి చిత్రహింసలకు గురిచేసింది. ఆమెకి గుండుకొట్టించి.. కనుబొమ్మలు గీయించింది. ఒంటిపై వాతలు పెట్టి చిత్రవధ చేసింది. నాలుగైదు రోజులపాటు భోజనం పెట్టకుండా గదిలోనే బంధించింది. ఒంటిపై సిగరెట్లతో కాల్చిన గాయాలు కుళ్లి.. ఆహారం లేక ఆకలితో అలమటించి దివ్య ప్రాణాలు విడిచింది. ఆమె చనిపోవడంతో శవాన్ని మాయం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఇలా అడ్డంగా దొరికింది.ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని జనాలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: