అక్రమ సంబంధాల వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయన్న విషయం తెలిసిందే.. కేవలం ఒక నిమిషం దొరికే క్షణాకాల సుఖం కోసం బంధాలను బంధుత్వాలను కూడా మరచి ప్రియుడితో రాసలీలలు చేస్తున్నారు.. అన్న భార్య వేరే  వాడితో అక్రమ సంబంధం పెట్టుకుందని, తన అన్నకు అన్యాయం చేసిందని ఆమె పై కోపాన్ని పెంచుకున్న మరిది ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

 


ఇక వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన వికారాబాద్‌ జిల్లా లో చోటు చేసుకుంది. యాప్రాల్ మండలం విశ్వనాథ్ ‌పూర్‌కి చెందిన అంబరప్ప అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె భర్తకి తెలియకుండా రహస్యంగా రాసలీలలు సాగించేవాడు. చివరికి రాసలీలల వ్యవహారం ఆమె భర్తకి తెలిసి పోవడం తో విషయం సీరియస్‌ అయింది. భార్య తో శారీరక సంబంధం పెట్టుకున్నాడన్న కోపం తో ఆమె భర్త అంబరప్ప పై పగ పెంచుకున్నాడు.

 

 


తన భార్య వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుందని తన తమ్ముడి తో చెప్పి బాధపడ్డాడు.. తన అన్న భాధను  చూడలేక పోయిన తమ్ముడు ఆమె ప్రియుడిని హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ బెడిసికొట్టడంతో ఉన్మాదిగా మారిన మరిది అతని కొడుకు(7)పై కత్తి తో దాడి చేశాడు. చిన్నారి పై కనికరం లేకుండా కత్తి తో పొడిచేయడం తో తీవ్రగాయాల పాలయ్యాడు.

 

 

వెంటనే స్పందించిన పిల్లాడి పేరెంట్స్ , గ్రామస్తులు హుటాహుటిన ఆసుపత్రిలో తరలించారు.పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. అంబరప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రంగం లోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: