సినిమాలను చూసి యువత ఊహాలోహంలో విహరిస్తున్నారు..సినిమాలలో ఎలా ఉందో అది నిజ జీవితంలో జరగాలని కోరుకుంటున్నారు. అందుకే ప్రేమ పేరుతో అమ్మాయిలను శారీరకంగా మానసికంగా హింసిస్తూ వస్తున్నారు..ఇక విషయానికొస్తే.. ఓ డిగ్రీ చదివే యువకుడు ఓ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. ప్రేమ అనేది ఒక మైకం .. అందులోకి దిగడమే తప్ప వెనక్కి రాలేరన్న విషయం తెలిసిందే.. అలా ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించిన ఆ కుర్రాడు తన మనసును గెలుచుకోవాలని ప్రయత్నించాడు.. అందుకు అమ్మాయి నో చెప్పడంతో ఆత్మ హత్య చేసుకున్నాడు..

 

 


వివరాల్లోకి వెళితే.. ఓ రోజు ఆమెకు తన ప్రేమ విషయాన్ని చెప్పేశాడు.. దానికి ఆ అమ్మాయి నో చెప్పడంతో తట్టుకోలేకపోయాడు. తన ప్రేమను నిరాకరించిందన్న బాధతో కుమిలిపోయాడు. జీవితం మీద విరక్తితో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చనిపోయే ముందు తన బాధను వ్యక్తం చేస్తూ లవ్ ఫెయిల్యూర్ పాటలకి టిక్‌ టాక్‌ వీడియోలు చేసి .. ఆ తరువాత రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

 

 

జిల్లాలలోని స్థానిక సాయి డిగ్రీ కళాశాలలో రాము అనే యువకుడు బీఎస్సీ చదువుతున్నాడు. స్థానికంగా ఓ యువతిని ప్రేమించాడు. ఆ విషయం తెలుసుకున్న ప్రియురాలు.. రాము ప్రేమకు నో చెప్పడంతో కుంగిపోయాడు. ఆమె లేని జీవితం తనకొద్దు అనుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.కాలేజీ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు రాము పై నుంచి వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. చేతికంది వచ్చిన కొడుకు ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. యువకుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. టిక్‌ టాక్ వీడియోలు చేసి మరీ ఆత్మహత్య చేసుకోవడం అందరిలో చర్చలకు దారి తీసింది.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: