కూతురిని ఇచ్చిన అత్త పేరు మీద కొన్ని లక్షల రూపాయల భీమా ఉంది.. అయితే ఆమె ఇటీవలే మృతి చెందడం తో ఆమె పేరు పై ఉన్న భీమా డబ్బులు కూతురికి సగం అందాయి.. దాన్ని పైన కన్నేసిన అల్లుడు ఆ డబ్బుల ను తనకివ్వాలని భార్యతో తరచూ గొడవ పడేవాడు.. అందుకు ఆమె నిరాకరించడం తో అతి కిరాతకం గా ఆమె గొంతు కోసి చంపేశాడు.. ఇద్దరు ముక్కు పచ్చలారాని పసి పిల్లలు అనాధలు అయ్యాయి.. ఈ దారుణ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. 

 

 

వివరాల్లోకి వెళితే.. ఈ సంఘటన కృష్ణా జిల్లా లో జరిగింది. చోటు చేసుకుంది. చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామానికి చెందిన డేగల పిచ్చయ్య(30)కి పెడన మండలం పోసినవారి పాలేనికి చెందిన దేవీ రాజేశ్వరి(22)తో ఐదేళ్ల కిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రాజేశ్వరి తల్లి మృతి చెందడం తో నామినీగా ఉన్న కూతురికి రెండు లక్షల రూపాయలు వచ్చాయి. ఆ బీమా డబ్బు తనకివ్వాలంటూ భర్త కొద్ది కాలంగా భార్య తో గొడవ పడుతున్నాడు. అందుకు ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. అదే విషయమై మరో మారు గొడవ జరగడం తో ఆవేశంతో భార్యని దారుణంగా హతమార్చాడు. క్షణికావేశంలో కిరాతకంగా చంపేశాడు.

 

 


భార్య చచ్చి పడి ఉండటంతో భయపడి పోయిన అతను అక్కడి నుంచి పారిపోయాడు.పిచ్చయ్య భోగిరెడ్డిపాలెం సమీపంలో గుళికలు తిని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లీతండ్రి మరణాలతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బుల కోసం కట్టుకున్న భార్యను హత్య మార్చడం వల్ల పిల్లలు అనాధలుగా మారారు.. ప్రస్తుతం ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: