మాములుగా భార్య భర్తల మధ్య బంధం అనేది ఎన్నో విలువలతో కూడినది.. అందుకే ఆ బంధం చాలా గొప్పది అని పెద్దలు అంటున్నారు. అందుకే పెళ్లి మన భారతీయ సంప్రదాయంలో  చాలా పవిత్రమైనది అని చెప్పాలి.అలాంటి బంధాలు ఇప్పడు మరుగున పడ్డాయి. అయితే ఇద్దరి మధ్య ప్రేమ తగ్గి కేవలం డబ్బు కోసం మాత్రమే ఈ బంధాలు పరిమితమవుతున్నాయి. 

 


ఇక్కడ ఓ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కట్టుకున్న భార్యను బ్లాక్ మెయిల్ చేసిన ఓ ప్రబుద్ధుడు. ఆమె దగ్గర కోటి రూపాయలు వసూలు చేసిన ఘటన హైదరాబాదులోని గచ్చిబౌలిలో వెలుగు చూసింది. సంతోష్ అనే యువకుడు భార్యను డబ్బు కోసం వేధింపులకు గురిచేస్తూ ఇప్పుడు కటకటాల వెనక్కి చేరాడు. సంతోష్ భార్యసాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. వ్యసనాలకు బానిసైన సంతోష్ భార్యను నిత్యం వేధించేవాడు.డబ్బులు ఇవ్వాలని ప్రతి రోజు వేధించాడు.చివరికి డబ్బు కోసం నీచానికి పాల్పడ్డాడు. 

 

 

 

స్నేహితుడి పేరుతో భార్యకు అశ్లీల సందేశాలు, వీడియోలు పంపేవాడు. ఆ అసభ్య వీడియోలు, సందేశాల ఆధారంగా భార్యను బ్లాక్ మెయిల్ చేసి కోటి రూపాయల వరకు రాబట్టాడు. అయితే ఇది ఎవరి పనో అర్థంకాక ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కొన్నాళ్లు మౌనంగా ఉన్నా, చివరికి భర్తపై అనుమానం కలగడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో సంతోష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారించేసరికి అన్ని విషయాలు వెల్లడించాడు. ఇదే తరహాలో అతడు గతంలో కొంతమంది మహిళలతో వ్యవహరించినట్టు పోలీసులు తెలుసుకున్నారు.ఎవరిని మోసం చేసాడు అనే విషయాలని తెలుసుకొని వారి దగ్గర తీసుకున్న డబ్బును వారికి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్ కు తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: