ప్రేమించిన ప్రియురాలిని అతి దారుణంగా చంపేసిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది..తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని అతి దారుణంగా హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది. ప్రేమిస్తున్న అమ్మాయికి పెళ్లి కుదిరిందని తెలిసి కోపంతో రగిలిపోయాడు. మార్కెట్‌కి వెళ్లిన యువతిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య చేశాడు. అడ్డుకోబోయిన ఆమె తల్లిని చాచిపెట్టి కొట్టడంతో స్పృహ‌ కోల్పోయింది. కొద్దిదూరంలో ఉన్న ఆమె తండ్రిని స్నేహితులు పట్టుకోవడంతో దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది.

 

 

 

సిటీలోని తులసీ నికేతన్ ఏరియా వివేక్ విహార్ కాలనీకి చెందిన నైనా కౌర్ కి ఇటీవల వివాహం నిశ్చయమైంది. నాగ్‌పూర్‌కి చెందిన యువకుడితో ఈ నెల 22 వ తేదీన పెళ్లి జరగాల్సి ఉంది. ఈలోపే దారుణం జరిగిపోయింది. నర్సింగ్ చదువుతున్న నైనా చిన్నప్పుడు ఢిల్లీలోని సుందర్ నగ్రి ప్రాంతంలోని స్కూల్‌లో చదువుకుంది. అదే ప్రాంతానికి చెందిన స్కూల్‌మేట్ షెరు ఖాన్ చిన్ననాటి నుంచి ఆమెను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ అతడిని మృగంలా మార్చింది..ఆ కోపంతో అతను ఏం చేస్తున్నాడో తెలియకుండా మూర్ఖంగా ప్రవర్తించాడు..

 

 


తన ప్రియురాలికి పెళ్లి కుదిరిందన్న విషయం తెలిసిన షెరు ఖాన్ ఆగ్రహంతో రగిలిపోయాడు. తనను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటోందన్న కోపంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులతో కలసి రాత్రి 8 గంటల సమయంలో మార్కెట్‌కి వెళ్లిన నైనాని దారికాచి దారుణంగా హత్య చేశాడు. మార్కెట్ నుంచి వస్తూ ఆమె ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద ఆగడంతో తండ్రి బల్దేవ్ సింగ్ కొంచెం ముందుకెళ్లాడు. తల్లితో కలసి ఆమె ఫుడ్ తీసుకునేందుకు నిల్చుని ఉన్న సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆ ముగురిలో ఒకరు అమ్మాయి తల్లిని కొట్టారు..దాంతో ఆమె అక్కడే సృహ కోల్పోయి పడిపోయింది.

 

 

ఎవరూ సమీపంలో లేక పోవడం చూసిన దుర్మార్గుడు..కత్తితో ఆమె మెడ, కడుపులో.. ఇతర అవయవాలపై విచక్షణా రహితంగా పొడిచేశాడు. సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న నన్ను మరో వ్యక్తి అడ్డుకున్నాడు’ అని మృతురాలి తండ్రి చెప్పారు. మార్కెట్‌లో అంతమంది ఉండి కూడా తన కూతురిని కాపాడేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదని ఆయన వాపోయాడు. తీవ్రగాయాలపాలైన నైనా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: