మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కొత్త చట్టాలను అమలు చేస్తూ నేరాలు చేస్తున్నా మగాళ్ళను చట్టపరంగా శిక్షిస్తున్న కూడా కామాంధులు మాత్రం రాజ్యమేలుతున్నారు.. దిశ , నిర్భయ లాంటి అమాయకులు కామాంధుల రాక్షసత్వాన్ని బలి అవుతున్నారు.. అలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్న కూడా మహిళల పై ,పాలు తాగే పసికందు ల పై మృగాళ్ల దాడులు చేస్తున్నారు.. క్షణ కాల సుఖం పొందడం కోసం దారుణాలు చేస్తున్నారు.మృగాళ్ల మారి ఆడవాళ్ళ మాన ,ప్రాణాలను అరించి వేస్తున్నారు..

 

 

 

ఇది ఇలా ఉండగా కరోనా తో ఓ యువతి బాధపడుతున్న ఆమె పై కూడా ఓ కామాంధుడు కామాదాహం తీర్చుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళితే.. కరోనా పాజిటివ్ వచ్చిన ఓ మహిళ గ్రేటర్ నోయిడా పరిధిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఆస్పత్రి సిబ్బంది ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అసభ్యంగా తాకుతూ లైంగిక వేధింపులకు గురిచేశారు. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో శానిటేషన్ వర్కర్, స్టోర్ కీపర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

 

 

 

ఆ ఇద్దరు ఆస్పత్రి సిబ్బంది కాదని.. ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్నారని ఆస్పత్రి  ఉన్నతాధికారులు తెలిపారు. రోగి పట్ల అసభ్య ప్రవర్తన విషయం తెలిసిన వెంటనే వారిని విధుల నుంచి తొలగించినట్లు ఏజెన్సీ తెలియ జేసిందని తెలిపారు. విచారకర సంఘటనకు క్షమాపణలు కోరారు. అంతే కాకుండా ఆ ఇద్దరి పై ఆసుపత్రి తరపున పోలీసులకు పిర్యాదు చేస్తామని అధికారులు అంటున్నారు.. అదండీ మహిళల మనుగడ రోజు రోజుకు తగ్గిపోతున్న కూడా ఉన్న వాళ్ళని కూడా ఈ కీచకులు పూర్తిగా రాక్షసత్వాన్ని తీర్చుకుంటున్నారు.. కరోనా తో బాధపడుతున్న కూడా పట్టించు కోకుండా లైగింక దాడికి పాల్పడ్డారు.. ఈ సంఘటన ప్రస్తుతం అందరికీ ఆగ్రహాన్ని కలిగించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: