భార్యా భర్తలు అన్నాక గొడవలు రావడం సహజం.. కానీ వాటిని ఆదిలోనే అనిగేలా చేసుకోవాలి.. లేదంటే వాటి వల్ల భార్య భర్తల బంధం దూరమవుతుంది.. అంతే కాకుండా కుటుంబం కూడా విడిపోతుంది.. అయితే ఈ మనుషులు క్షణి కావేశంలో బంధాన్ని తెచ్చుకుంటూ పోవడమే కాదు.. కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అవుతున్నాయి.

 

 

అయితే, వాటివల్ల కొన్ని పచ్చగా సాగాల్సిన సంసారం చేతులారా నాశనం అవుతుంది. పిల్లలు అనాధలు అవుతారు.. అందుకే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆలోచించాలి అని పెద్దలు చెబుతుంటారు.. అసలు విషయానికొస్తే.. ఓ వ్యక్తి భార్య పై కోపంతో అతి కిరాతకంగా చంపాడు.. ఏకంగా భార్య ను గొడ్డలి తో నరికి చంపాడు.. ప్రస్తుతం ఈ ఘటన తెలంగాణ లో చోటు చేసుకుంది.

 

 

వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన వికారాబాద్‌ లో జరిగింది. జిల్లాలోని ధారూర్ మండలం మైలారం కొత్త తండాకు చెందిన కిషన్ నాయక్‌కి లక్ష్మీనగర్ తండాకి చెందిన గాంగ్లిబాయితో 13 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు సంతానం. కొద్ది కాలం సాఫీ గానే సాగిన వారి కాపురం లో కలహాలు మొదలయ్యాయి. నిత్యం ఏదో విషయమై గొడవ పడుతుండేవారు. అలా వారి గొడవ చిలికి చిలికి పెద్దదైంది..

 

 

 

దీంతో కోపోద్రుడైనా భర్త తనను చంపేయాలని నిర్ణయించుకున్నాడు... తీవ్ర వాగ్వాదం జరగడం తో ఆగ్రహానికి గురైన భర్త ఘాతుకానికి తెగబడ్డాడు. భార్యని గొడ్డలితో విచక్షణా రహితంగా నరికేశాడు. తీవ్రంగా గాయపడిన గాంగ్లిబాయిని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యను అలా నరికి చంపిన భర్తను అమ్మాయి తరపు బంధువులు డిమాండ్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: