వావి వరుసలు మరచి పోయి ఓ వృధ్ధ కామాంధుడు హద్దులు దాటాడు.. తన వయసును కూడా మరచి పోయి దారుణానికి పాల్పడ్డాడు.. ప్రభుత్వం ఎన్నో చట్టాలను మహిళలను మృగాళ్ల నుంచి కాపాడటానికి చర్యలు తీసుకుంటున్నా కూడా కామాంధుల చేతిలో రోజు మహిళలు బలవుతున్నారు.. అత్యాచారానికి గురవతున్నారు..అంతేకాక హత్యకు గురవుతున్నారు.. విషయానికొస్తే.. ఓ వృద్ధుడు తన వయసు పైబడిన సంగతిని మరచిపోయాడు.. దాంతో పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. 

 

 


వివరాల్లోకి వెళితే..  ఈ దారుణ సంఘటన గుంటూరులో వెలుగు చూసింది .. తన మనవరాలి వయసుండే పదేళ్ల బాలికపై 70ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. తెనాలి గ్రామీణ మండలంలోని ఓ గ్రామంలో బంగారయ్య(70) అనే వృద్ధుడు నివసిస్తున్నాడు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బాలిక(10) లాక్‌డౌన్‌కు ముందు తన అమ్మమ్మ ఊరైన ఆ గ్రామానికి వచ్చింది. ఆదివారం ఆ బాలిక తోటి పిల్లలతో కలిసి బంగారయ్య ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. దీంతో ఆమెపై కన్నేసిన ఆ కామాంధుడు చాక్లెట్లు ఇస్తానని నమ్మించి ఇంట్లోకి పిలిచాడు.

 

 


తాతయ్య కదా చాకెట్లు తెచ్చుకుందామని అతని కూరత్వాన్ని పసిగట్టలేని పసిది లోపలికి వెళ్ళింది.. అలా ఆ చిన్నారి లోపలికి వెళ్లి వెళ్ళగానే లోపలి నుంచి తలుపుకు గడియ వేశాడు..దుస్తులు విప్పి అత్యాచారానికి యత్నించడంతో గట్టిగా కేకలు వేసింది. దీంతో తోటి పిల్లలు ఆ ఇంటికి చేరుకుని కిటికీలో నుంచి చూసి షాకయ్యారు. వారు కూడా గట్టిగా కేకలు వేయడంతో కంగారుపడిన బంగారయ్య బాలికను విడిచిపెట్టాడు. చిన్నారి ఏడుస్తూ ఇంటికి వెళ్లి అమ్మమ్మకు జరిగిన విషయాన్ని చెప్పింది. ముసలాడు చేసిన పనికి షాక్ అయిన ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు బంగారయ్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: