వినడానికే షాకింగ్ గా ఉంది కదా! ఇది షాక్ గురి చేసే ఘటనే అయినప్పటికీ నిజంగానే జరిగింది. ఓ బామ్మా తెలియకుండా చేసిన చిన్న పొరపాటు కారణంగా ఇద్దరు ప్రాణాలు గాలిలోకి కలిసిపోయాయి. వృద్యాప్యంలో మతిస్థిమితంతో బాధపడుతున్న అమ్మమ కారణంగా ఈ దారుణ ఘటన జరిగింది. 

 

IHG

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం ఏఎల్‌పురం గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతులు తవణంపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన రోహిత్‌, జీవాగా గుర్తించారు. అయితే చిత్తూరు మండలంలోని బ్రాహ్మణ పల్లికి చెందిన ఇద్దరు చిన్నారులు అమ్మమ్మ ఊరైన ఏఎల్ పురానికి వచ్చారు. 

 

IHG

 

దీంతో ఆనందంతో ఇద్దరు చిన్నారులకు కోడి కూర వండి పెట్టాలనుకుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే కోడి కూర చేసే సమయంలో మసాలా బదులు ఏకంగా గుళికలు, మందులు వేసేసింది. ఇంకా అది తెలియక ఆ గుళికలు వేసిన కోడి భోజనం తినడంతో ఆ ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. 

 

IHG

 

మతిస్థిమితం లేని అమ్మమ్మ వంట తినడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అందరూ భావిస్తున్నారు. ఇంకా ఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.                               

మరింత సమాచారం తెలుసుకోండి: