ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ నిజంగానే ఓ మహిళను అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో చోటుచేసుకుంది. క్వారీ కెనాల్‌ రోడ్డులో శుక్రవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం క్వారీ కెనాల్‌ రోడ్డులో తూరుబెల్లి రోహిణి అనే 30 ఏళ్ల మహిళ తన తల్లి వెంకటలక్ష్మితో కలిసి నివాసం ఉంటుంది. 

 

అయితే మధ్యాహ్నం సమయంలో ఆమె ఇంట్లో నుంచి ఏడుపులు వినిపించడంతో స్థానికులు అంత వెళ్లిచూడగా రోహిణి మృతదేహం రక్తపుమడుగులో పడి ఉంది. దీంతో అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే వారి ప్రథిమిక దర్యాప్తు ప్రకారం ఈ నెల 10వ తేదీన ఆ ఇంట్లోకి అనంతపురానికి చెందిన భార్యాభర్తలు అద్దెకు దిగారు. 

 

IHG

 

అయితే వారే పదునైన ఆయుధంతో రోహిణి గొంతుకోసి హత్యకు పాల్పడ్డారు అని సమాచారం. ఇంకా ఈ ఘటనలో మృతురాలి తల్లి చేతికి కూడా తీవ్ర గాయమైంది. దీంతో ఆమె అపస్మారక స్థితిలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

 

IHG

 

హత్య జరిగిన అరగంటలోనే వారిని అరెస్ట్ చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వైపు కారులో వెళ్లిన ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హత్య చేసిన ఆ దంపతులు గోదావరిలో స్నానం చేసి బయటకు వస్తుండగా పోలీసులు ఆ నిందితులను అరెస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: