అమ్మాయిల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను అమలు చేస్తున్న కూడా కామాంధుల చేతిలో రోజు మహిళలు బలవుతున్నారు. రక్షణ కోసం వచ్చిన మహిళలపై కూడా ప్రభుత్వాధికారులు అఘాయిత్యాలు చేసిన రోజులు కూడా లేకపోలేదు. అసలు విషయానికొస్తే ఓ డాక్టర్ వైద్యం కోసం వచ్చిన యువతపై అమానుషంగా ప్రవర్తించారు.. క్రూర మృగంలా మీద పడి లైంగిక దాడి చేశారు. 

 

 


వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు లో సోమవారం సాయంత్రం జరిగింది. ఏలూరు వన్‌ టౌన్‌ నాలుగో డివిజన్‌కు చెందిన డాక్టర్ పంతాల సత్యా నంద్‌ స్థానికంగా క్లినిక్ నిర్వ హిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతి ఆదివారం అనారోగ్యం గా ఉండటం తో తన తల్లి ని తీసుకుని ఆ క్లినిక్‌ కు వెళ్లింది. సత్యా నంద్‌ ఆమెకు ఇంజెక్షన్లు చేసి పంపించాడు. సోమవారం సాయంత్రం యువతి కి ఫోన్ చేసిన డాక్టర్ మరికొన్ని ఇంజెక్షన్లు చేయాలని చెప్పాడు. తాను బయటకు వెళ్తున్నానని, ఇప్పుడే వచ్చి ఇంజెక్షన్లు చేయించు కోవాలని చెప్పడం తో ఆమె తన తమ్ముడిని వెంట బెట్టుకుని క్లినిక్‌కు వెళ్లింది.

 

 


సత్యానంద్‌ ఆ యువతిని గది లోకి తీసుకెళ్లి ఏవో ఇంజెక్షన్లు చేశాడు. దీంతో మైకానికి గురైన ఆమె దుస్తులు తొలగిస్తూ అత్యాచారాని కి యత్నించాడు. ఈ క్రమం లోనే తేరుకున్న యువతి అతడిని వెనక్కి నెట్టేసి గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. తమ్ముడి తో సహా ఇంటికి చేరుకున్న యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం ఏలూరు వన్‌టౌన్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో డాక్టర్ సత్యానంద్‌పై కేసు నమోదు చేశారు.వైద్యం కోసం వచ్చిన యువతిపై అలా చేయడం పై స్థానికులు మండిపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: