రాను రాను ప్రపంచం మొత్తం అక్రమ సంబంధాల కు కేరాఫ్ గా మారనుంది..ముఖ్యంగా మహిళలు అక్రమ సంబంధాల కోసం వేరొకరిని కోరుకుంటున్నారు.. అంతేకాదు పచ్చటి సంసారాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తును కూడా దారికి వదిలేస్తున్నారు.. కేవలం ఐదు నిమిషాల్లో దొరికే శారీరక సుఖం కోసం కట్టుకున్న భర్త కూడా చంపేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య చాలానే వెలుగు చూశాయి.. 

 

 

అసలు విషయానికొస్తే.. కట్టుకున్న భర్త నిద్రలో ఉండగా అతనిని చంపేసి , ప్రియుడితో శృంగార క్రీడలో ఓ భార్య మునిగి తేలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళితే..  అనంతపురం జిల్లా పుట్టపర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. పుట్టపర్తి మండలం ఇరగరాజుపల్లిలో కొత్తచెరువు వెంకటేసు, అరుణ దంపతులు నివాసముంటున్నారు. అరుణ అదే గ్రామానికి చెందిన కేశవ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న వెంకటేసు పద్ధతి మార్చుకోవాలని అనేకసార్లు భార్యను మందలించాడు. దీంతో తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను చంపేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది.

 

 

గాఢనిద్రలో ఉన్న భర్తను అరుణ కొడవలితో దాడిచేసి చంపేసింది. ఇంట్లో పడిన రక్తపు మరకలను జాగ్రత్తగా తుడిచేసి అక్కడి నుంచి ప్రియుడి వద్దకు వెళ్లి రాసలీలలు సాగించింది. శుక్రవారం మధ్యాహ్నం ఏమీ తెలియనట్లు తిరిగి ఇంటికి వచ్చి భర్త మృతదేహాన్ని చూసి రోదించింది. తనను డ్వాక్రా పనిమీద పెడపల్లి బ్యాంకు వద్ద భర్తే బైక్‌పై దించి వెళ్లాడని, ఇంతలోనే ఆయన్ని ఎవరో హత్య చేశారని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.ఆమె ప్రవర్తన పై అనుమానం వచ్చిన బావ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణను అదుపులోకి తీసుకుని విచారించగా తానే భర్తను చంపినట్లు నేరం అంగీకరించింది. దీంతో అరుణపై హత్యకేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెకు సహకరించిన కేశవను సహ నిందితుడిగా చేర్చారు. అక్రమ సంబంధం కోసం కట్టుకున్న భర్తను దారుణంగా చంపేసిన అరుణను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: