పొట్ట కూటి కోసం పట్టణానికి వచ్చిన యువతులను బలంతంగా కొందరు దుర్మార్గులు ఎత్తుకెళ్లి వ్యభిచార వృత్తిలోకి దించుతున్నారు...ఈ ఘటన నెల్లూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే.. లాక్ డౌన్ ఒకవైపు కొనసాగుతున్న కూడా గుట్టు చప్పుడు కాకుండా ఇళ్ల మధ్యనే ఉంటూ భారీ వ్యభిచారాన్ని చేయిస్తున్నారు.మెట్రో సిటీ అయిన హైదరాబాద్ లో పలు చోట్ల వెలుగు చూసింది. వారి గుట్టు రట్టు చేసిన పోలీసులకు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది.. ఆంధ్రప్రదేశ్ లో వరుసగా ఈ వ్యభిచారం భయపడుతుంది. నెల్లూరులో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు..

 

 

వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కావలి పట్టణంలో వ్యభిచారం దందా ఊపందుకుంది. నగరం నడిబొడ్డున ఉన్న ఓ ఇంట్లో యువకుల తాకిడి ఎక్కువ అయింది. రేయింబవళ్ళు యువకులు వచ్చి వెళ్తున్నారు. దాంతో స్థానికులు అసలు అక్కడ ఏం జరుగుతుంది. ఎందుకు కుర్రాళ్ళ అక్కడకు ఎక్కువగా వస్తున్నారో తెలియక పోలీసులకు సమాచారం అందించారు.. వారి గోల వల్ల అర్ద రాత్రులు నిద్ర పోలేకున్నామని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు..

 

 

స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. తటవర్తి వారి వీధిలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడులు చేసి ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొద్దిమొత్తంలో నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. కావలి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ వ్యభిచారాన్ని నడిపిస్తున్న ముఠా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. ప్రభుత్వం ఇలాంటి కార్య కలాపాలను చేయకూడదు అని ఎన్ని సార్లు చెప్పినా వినకుండా ఇలానే చేస్తున్నారని, అసలు నిందితులను పట్టుకొని వారిని ఊసలు లెక్కబెట్టిస్తామని హెచ్చరించారు.అయిన కానీ ఆ విషయం జరిగిన కొద్దీ రోజుల వ్యవధిలోనే మళ్లీ ఇలా జరగడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: