అమ్మాయిలపై అఘాయిత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఏ పాపం చేయని అమ్మాయిలు కూడా మగాళ్ళ విపరీత చర్యలకు బలవుతున్నారు. తాజాగా గుజరాత్ లో జరిగిన ఒక సంఘటన అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుంటే గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలోని సర్దార్ నగర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి 15 ఏళ్ల కూతురు ఉంది. వీళ్ళ ఇంటికి కొంచెం దూరంలోనే రోహిత్ పాట అనే యువకుడు నివసించేవాడు. అయితే గత కొన్ని  వారాల క్రితం రోహిత్ భాటియా యువకుడు నేరుగా బాలిక తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఆ అమ్మాయి నగ్న ఫోటోలను చూపించాడు. ఈ నగ్న ఫోటోలను తన ఫ్రెండ్ నింకుజ్ రాథోడ్ కి పంపించినట్టు తను చెప్పుకొచ్చాడు. దాంతో ఒక్కసారిగా కంగుతిన్న తల్లిదండ్రులు ఈ ఫోటోలు ఏంటి అని గట్టిగా నిలదీశారు. కానీ రోహిత్ భాటియా కాస్త కూడా భయపడకుండా బెదిరింపులకి పాల్పడి మీ అమ్మాయి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వకుండా ఉండాలంటే నాకు పదిహేను లక్షల రూపాయలు ఇవ్వండి అని గద్దించాడు.


ఏం జరుగుందో అర్థంకాని తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై ఆపై తేరుకొని తన అమ్మాయిని ఈ విషయం గురించి అడిగారు. అప్పుడు ఆ బాలిక భోరున ఏడుస్తూ... తన స్నేహితుడు ద్వారా రోహిత్ భాటియా పరిచయమయ్యాడని తరచూ ఫోన్ చేసేవాడని... ఒకానొక రోజు భాటియా అతని ఫ్రెండ్ అయిన నింకుజ్ తో మాట్లాడాలని కోరినప్పుడు తను భాటియా ని బ్లాక్ లిస్ట్ లో పెట్టానని చెప్పుకొచ్చింది. కొన్ని రోజుల తర్వాత నింకుజ్ బాలికకి ఫోన్ చేసి 'నువ్వు భాటియా తో మాట్లాడుతున్నావని మీ తల్లిదండ్రులతో చెప్తా. చెప్పకుండా ఉండాలంటే నీ నగ్న చిత్రాలు నాకు పంపించాలి' అని బెదిరించగా హడలిపోయిన సదరు బాలిక వెంటనే తన నగ్న చిత్రాలను అతనికి పంపించింది.


కొన్ని రోజుల తర్వాత ఆ నగ్న ఫోటోలను తీసుకొని తల్లిదండ్రులకు వచ్చి బెదిరించడం ప్రారంభించాడు భాటియా. దీంతో ఈ కీచకుల భరతం పట్టేందుకు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా వెంటనే స్పందించిన పోలీసులు భాటియా, నింకుజ్ లతో పాటు బాలిక ఫ్రెండ్ ని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఏది ఏమైనా తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: