డబ్బులు వస్తున్నాయంటే ఈ మనుషులు గడ్డి తినడానికి కూడా రెడీ అవుతున్నారు అంటే అతిశయోక్తి కాదు..డబ్బుల కోసం అడ్డదారులు తొక్కడం, ఆస్తి పంపకాలు సరిగ్గా లేదనే..చాలా మంది దారుణాలు చేస్తున్నారు. సొంత వాళ్ళను కూడా చూడకుండా దారుణంగా హత్యలు చేస్తున్నారు. చేయిస్తున్నారు..అసలు విషయానికొస్తే .. ఓ సవతి తల్లి కూతురికి ఆస్తి వస్తుందని కోపంతో తన కొడుకుతో రేప్ చేయించింది..ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. 

 

 

వివరాల్లోకి వెళితే .. సవతి తల్లి అనే పదానికే ఓ మహిళ మచ్చ తెచ్చిన ఘటన జార్ఖండ్‌లో జరిగింది. ఆస్తి మొత్తం సవతి కూతురికే దక్కుతుందన్న అక్కసుతో తన కొడుకుని రెచ్చగొట్టి ఆమెపై అత్యాచారం చేయించింది. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ ప్రాంతానికి చెందిన చాందిని అనే మహిళ భర్త నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ఆమె అదే ప్రాంతానికి చెందిన రామ్‌దేవ్‌ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. చాందిని అప్పటికే 19ఏళ్ల కొడుకు ఉండగా, రామ్‌దేవ్‌కు కూడా మొదటి భార్యతో కలిసిన కూతురు ఉంది.

 

 


పెళ్ళైన కొద్దీ రోజుల పాటు చాందినీ తో బాగా ఉండేది.. తర్వాత తన భర్తకు సంబంధించి చాలా ఆస్తులు ఉన్నాయని అవన్నీ సవతి కూతురికి చెందుతాయని అక్కసు పెంచుకుంది.. ఆ ఆస్తి మొత్తం తనకు తన కొడుకుకి చెందాలని నిర్ణయించుకుంది.ప్లాన్ ప్రకారం తన కొడుకు, సవతి కూతురుని వెంటబెట్టుకుని పిక్‌నిక్ పేరుతో సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ బాలికను బంధించి తన కొడుకును రెచ్చగొట్టి అత్యాచారం చేయించింది.మరో సారి ఆమె పై అత్యాచారం చేయాలని ఆ దుర్మార్గులు అనుకోవడం చాందినీ ఇంట్లో నుండి పారిపోయి చెరువులో దూకింది..అది గమనించిన స్థానికులు ఆమెను కాపాడి అసలు విషయాన్ని తెలుసుకున్నారు..దీంతో పోలీసులు సవతితల్లి, ఆమె కొడుకుతో పాటు వారికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: