సినిమాలను చూసి యువత చెడిపోతున్నారు అంటే అది నిజమని అంటున్నారు పెద్దలు.. ఒకప్పుడు సినిమాలను చూస్తే జ్ఞానం వచ్చేది.. కానీ ఇప్పటి సినిమాల ను చూస్తే కథకు మించి బోల్డ్ సీన్లు .. యువతను రెచ్చగొట్టే విధంగా రొమాన్స్ ఇవన్నీ చూసిన యువత తప్పుడు మార్గంలో నడుస్తున్నారు.. వయసు మాట పక్కన పెట్టేసి మరి తప్పుడు మార్గంలో నడుస్తున్నారు.. ప్రేమ అంటూ చిన్న వయసులోనే మహిళలపై దాడులు చేస్తున్నారు.. బంగారు భవష్యత్తును మొదటి లో నే నాశనం చేసుకుంటున్నారు.. 

 

 

అసలు విషయానికొస్తే .. ఓ యువకుడు పదనాలుగెళ్ల వయసులోనే మహిళల పై లైంగిక దాడులు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..వివరాల్లోకి వెళితే..ఇద్దరు బాలికలపై ఓ బాలుడు అత్యాచారానికి యత్నించిన ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని ఓ గ్రామం లో వెలుగు లోకి వచ్చింది. ఆదివారం జరిగిన ఈ ఘటన పై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామం లో ఆదివారం ఇద్దరు బాలికలు బయటికొచ్చి ఆడుకుంటున్నారు. వారిని గమనించిన అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు వారికి మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు.

 

 

అలా ఇంటికి వెళ్ళగానే రూం లో గడియ పెట్టాడు.. తర్వాత ఇద్దరిపై లైంగిక దాడికి దిగాడు.. దీంతో భయపడిన బాలికలు ఇద్దరు గట్టిగా కేకలు వేశారు..స్థానికులు అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. ఏం జరిగిందని చిన్నారులను అడగ్గా అసలు విషయం చెప్పారు. దీంతో గ్రామస్థులు ఆ బాలుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు బాలుడిని విచారించగా నేరం అంగీకరించాడు. పూసపాటిరేగ ఎస్ఐ బాలాజీరావు నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు, అత్యాచారయత్నం, డిజిబిలిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు..ఇలాంటి కామాంధుడు బయట తిరగనివ్వకూడదని హెచ్చరించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: