డబ్బుల కోసం ఈ మనుషులు ఎలా మారుతున్నరంటే డబ్బులు వస్తాయంటే వాడి చెయ్యిని వాడే నరుక్కొనే దారుణమైన రోజులు ఇవి.. వాటికోసం ఈ మనుషులు గడ్డి తినడానికి కూడా రెడీ అవుతున్నారు అంటే అతిశయోక్తి కాదు..డబ్బుల కోసం అడ్డదారులు తొక్కడం, ఆస్తి పంపకాలు సరిగ్గా లేదనే..చాలా మంది దారుణాలు చేస్తున్నారు. సొంత వాళ్ళను కూడా చూడకుండా దారుణంగా హత్యలు చేస్తున్నారు. చేయిస్తున్నారు..అసలు విషయానికొస్తే .. ఓ వ్యక్తి రెండో భార్య కొడుకులకు ఆస్తిని ఇస్తున్నారని కోపంతో తండ్రి అని కూడా చూడకుండా మొదటి భార్య కొడుకులు అతి కిరాతకంగా చంపేశారు. 

 


వివరాల్లోకి వెళితే.. తండ్రిని హత్య చేయించిన ఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగింది. తిరుపతి చంద్రశేఖర్‌రెడ్డి కాలనీకి చెందిన ఈతమాకుల గురవయ్య(75)కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మమ్మకు గురమ్మ, గంగయ్య ఇద్దరు పిల్లలు. లక్ష్మమ్మ 1982లో చనిపోవడంతో 1984లో మారెమ్మను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టడంతో అప్పటి నుంచి వారితోనే ఉంటున్నారు. గురవయ్యకు తన పూర్వీకుల నుంచి తిరుపతిలో 1.75 ఎకరాల పొలం వచ్చింది.ఆ భూమినంతటిని రెండో పిల్లలను రాసిచ్చేందుకు గురవయ్య సిద్ధపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటిభార్య కొడుకులు తమకు కూడా సగం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. దీంతో ఏడాది కిందట గురవయ్యతో మొదటి భార్య కొడుకు గంగయ్య గొడవపడ్డాడు.

 

 

అయిన తండ్రి ఒప్పుకోక పోవడంతో అతని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు..ఉమేష్‌ అనే సుపారీ కిల్లర్‌ను పరిచయం చేసుకున్నాడు. తన తండ్రికి హత్య చేయడానికి రూ.20 లక్షలు కాంట్రాక్టు కుదుర్చుకున్నారు.గత నెల 26వ తేదీ మధ్యాహ్నం నెంబరు ప్లేటు లేని స్కూటీలో సతీష్‌, కిరణ్‌ నగరంలోని చంద్రశేఖర్‌రెడ్డి కాలనీలో ఉంటున్న గురవయ్య ఇంటి వద్దకు వెళ్లారు. వెంట తెచ్చుకున్న కత్తి తీసి గురవయ్య గొంతు, చాతీపై పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అతడు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయాడు. మృతుడి రెండో భార్య కొడుకు రాంప్రసాద్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.ఈ కేసుకు సంబంధించిన ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి కత్తి నీ స్వాధీనం చేసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: