ఈ మధ్య వివాహేతర సంబంధాలు రోజు రోజు కు ఎక్కువ వుతున్నాయి. క్షణ కాల సుఖం వావి వరుసలు మరచి అక్రమ సంబంధాల ను కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా పచ్చటి సంసారాల ను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఈ అక్రమ సంబంధాల కోసం కట్టుకున్న భర్త అడ్డుస్తున్నాడని ఓ భార్య అతి కిరాతకం గా చంపిన ఘటన ఆలస్యం గా వెలుగు లోకి వచ్చింది. ఓ మహిళా అక్రమ సంబంధానికి అలవాటుపడి మరిది తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె సుఖానికి భర్త అడ్డొస్తున్నాడని అతి దారుణం గా హత్య చేసి చేతులు దులుపుకుంది. 

 

 

వివరాల్లోకి వెళితే.. తాజాగా మరిది తో రాస లీలలు సాగిస్తున్న వదిన వ్యవహారం బట్ట బయలైందని భర్తని దారుణం గా హత్య చేసిన అమానుష ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటన ఢిల్లీ లో వెలుగు చూసింది. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఏరియా లో ఆనంద్ అహిర్వార్, భారతి అహిర్వార్ దంపతులు నివాసముంటున్నారు. కామ కోరికల తో రగిలి పోయిన భారతి స్వయానా భర్త తమ్ముడు రింకుతో శారీరక సంబంధం పెట్టుకుంది. భర్తకి తెలియకుండా రహస్యంగా రాసలీలలు సాగించేది. మరిది తో కామవాంఛలు తీర్చుకుంటున్న వ్యవహారం భర్తకి తెలిసి పోవడంతో దారుణానికి పాల్పడింది.

 

 

అతనిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుంది.మరిదితో కలసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. రింకు మామ కొడుకు కల్లు అలియాస్ అనిల్, సోదరి సీమా అహిర్వార్ సాయంతో అమానుషంగా చంపేశారు. గొంతుకి తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఆనంద్ శవాన్ని బైక్‌పై తీసుకెళ్లి పటారా చౌక్ వద్ద పడేసి చేతులు దులుపుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకొని విచారణ చేపట్టగా అసలు రంగు బయటకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: