కరోనా తర్వాత విన పడుతున్న పేరు వ్యభిచారం.. ఈ వ్యభిచారం వల్ల ఎన్నో సంసారాలు గుల్ల వుతున్నాయి.. అంతే కాకుండా మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన యువతుల కు మాయ మాటలు చెప్పి డబ్బు ఆశ చూపించి ఈ ఉచ్చు లోకి దించుతున్నారు.. అలా వారి శరీరాలతో వ్యాపారం చేస్తూ సొమ్ము పోగేసుకుంటున్నారు .. అంతే కాదు వ్యాపారం చేస్తున్న కూడా డబ్బులు ఇవ్వలేదని చాలా మంది మహిళలు ఎదురు తిరిగారు.. అలా ఎదురు తిరుగుతున్న వారిని బలము తో, బలగం తో అనిచివేస్తున్నారు.. 

 

 

అసలు విషయాని కొస్తే .. ఉద్యోగాల పేరు తో అమ్మాయి లను వలల లో వేసుకొని బలవంతంగా వ్యభిరం లోకి దించుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టైంది. ఉద్యోగాల పేరుతో యువతుల ను తెచ్చి బలవంతం గా వ్యభిచారం చేయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. యాప్రాల్ పరిధి లోని ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు ఆ గృహం పై పోలీసులు దాడులు చేశారు. నలుగురు యువతుల ను అదుపు లోకి తీసుకున్నారు. ఉపాధి పేరు తో హైదరాబాద్ తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారని యువతులు చెప్పడం తో వారందరినీ రెస్క్యూ హోమ్‌ కి పంపించారు. 

 

 

అక్కడ దొరికిన అమ్మాయిలు ముంబాయి ప్రాంతం లోని  నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మయిలుగా పోలీసులు గుర్తించారు. ఉపాధి ఇప్పిస్తామంటూ హైదరాబాద్ తీసుకువచ్చి బలవంతం గా వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. మోసగాళ్ల మాటలు నమ్మి యువతులు ఇక్కడికి రావొద్దని.. వచ్చి వ్యభిచార కూపం లో ఇరుక్కుపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.. ఇలా అమ్మాయిలు పరిస్థితుల ను ఎదుర్కొంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు..

మరింత సమాచారం తెలుసుకోండి: