భార్యపై అనుమానం తో భర్త ఆమెను ఇంత దారుణానికి పాల్పడ్డాడా..? భర్తతో కలిసి మందు తాగిన కమల వివాహేతర సంబంధం విషయం పై గొడవ పడింది. ఆమెతో నీకేంటి సంబంధం అంటూ నిలదీసింది. ఇలా చిన్న గొడవ కాస్త ఆగ్రహంగా మారింది. తంగ రాజ్ దారుణానికి పాల్పడ్డాడు. భార్యా భర్తలిద్దరూ కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఫుల్ గా తాగి  భార్య నెమ్మదిగా భర్త ఎఫైర్ గురించి  అడగడం ప్రారంభించింది. అయితే ఆ తర్వాత బంధువులు అయిన మహిళ తో భర్తకి అక్రమ సంబంధం ఉందని ఆమె ప్రశ్నించింది. దీంతో భర్త కోపంతో రగిలి పోయాడు. 

 

తనకి ఆమెతో ఏ సంబంధం లేదని అబద్ధం ఆడే ప్రయత్నం చేసాడు కానీ ఆమె ఏ మాత్రం వినలేదు. దీంతో ఆగ్రహం ఎక్కువై కిరోసిన్ పోసి ఆమె పై నిప్పంటించాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే కోయంబత్తూరు లోని అమ్మంకుళం ఏరియాకు చెందిన తుంగ రాజు భార్య కమల తో కలిసి నివాసముంటున్నాడు. వాళ్ళిద్దరికీ ఇద్దరు సంతానం. ఆ పిల్లలు ఇద్దరికీ వివాహం అయిపోయి వేరే చోట నివాసముంటున్నారు. అయితే ఈ భార్యా భర్తలిద్దరూ కలిసి మందు తాగే వారు. వాళ్ళిద్దరూ మందు పార్టీ చేసుకున్నాక ఈ గొడవ జరిగింది .

 

అయితే వాళ్ళిద్దరు మందు త్రాగే వరకు  బానే ఉన్నారు. కానీ మందు తాగిన తర్వాత భార్య అక్రమ సంబంధం పై నిలదీయడంతో ఆగ్రహం తో ఊగిపోయాడు.  ఇంకా కోపం ఎక్కువై కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు చేరుకొని మంటలను ఆర్పేశారు. తను  50 శాతం గాయాల తో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది హత్యాయత్నం కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు .

మరింత సమాచారం తెలుసుకోండి: