అక్రమ సంబంధాల వల్ల పచ్చటి సంసారాలు కూలిపోవడానికి మూలకారణాలు అవుతున్నాయి..వాటి వల్ల కుటుంబాలు మొత్తం చిన్నా భిన్నం అవుతున్నాయి.. అలాంటి వాటి కోసం ఆడ మగ. అని తేడా లేకుండా ఇష్టానుసారంగా చేస్తున్నారు.ఇక్కడ అసలు విషయానికొస్తే.. వదినతో ఓ మరిది అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.. అయితే ఆమెను ప్రతిసారీ కలుసుకోవడానికి అన్న అడ్డుగా ఉన్నాడని అతన్ని చంపి బొంద పెట్టేశాడు.. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది. 

 

 

కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రెండ్రోజుల క్రితం జరిగి నాగరాజు హత్య కేసును పోలీసులు చేధించారు. వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడే సొంత అన్నను దారుణంగా చంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆత్మకూరుకు చెందిన నాగరాజు కు ప్రకాశం జిల్లా సాకవరానికి చెందిన ఈశ్వరమ్మతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన నాగరాజు అప్పుల పాలైన వాటిని తీర్చేందుకు ఓ ప్లాటును విక్రయించాడు. భర్త నిత్యం మద్యం తాగుతూ తనను పట్టించుకోకపోవడంతో ఈశ్వరమ్మ తన మరిది మహేష్‌కు దగ్గరైంది. మరిదితో అక్రమ సంబంధం పెట్టుకుని రోజూ రాసలీలలు కొనసాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు పద్ధతి మార్చుకోవాలని ఇద్దరిని హెచ్చరించాడు.

 


నాగరాజు చేసిన అప్పులు తీర్చేందుకు తల్లి మరో ప్లాటు అమ్మాలని నిర్ణయించింది. కుటుంబానికి మిగిలివున్న ఆ ఒక్క ప్లాటు కూడా విక్రయిస్తే ఆస్తి లేకుండా పోతుందని ఈశ్వరమ్మ, మహేష్ ఆలోచించారు. నాగరాజు చంపేస్తే ఆస్తి నిలవడంతో పాటు తమ బంధానికి అడ్డు లేకుండా పోతుందని అనుకున్నారు. ఈ నెల 24న నాగరాజు తల్లి బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ రోజు రాత్రి నాగరాజుతో కలిసి మహేష్, వారి మేనమామ మద్యం తాగారు. మత్తులోకి జారుకున్న అతడిని ప్రభుత్వాసుపత్రికి ఎదురుగా ఉండే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశారు. మరుసటి రోజు కుక్కలు శవాన్ని బయట తీయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.. దీంతో అసలు హంతకులు విషయాన్ని కక్కేశారు.. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: