అనుమానం పెను భూతం అన్న సామెత వినే ఉంటారు.. అవును నిజమే అండి.. అనుమానం కారణంగా చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారు.. ఇప్పుడు కూడా అదే జరిగింది. అనుమానం తో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు.. విషయానికొస్తే.. ఓ వ్యక్తి తన భార్య తనస్నేహితుడుతో సన్నిహితం గా ఉందని అనుమానంతో అతన్ని అతి కిరాతకంగా తుపాకితో కాల్చి చంపారు.. 

 

 


వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘట యూపీ లోని ఘజియాబాద్‌ లో చోటు చేసుకుంది. నగరం లోని లోని ఏరియా లో ప్రైవేటు ఉద్యోగి సంజయ్ శర్మ అతని భార్యతో కలసి నివాసముంటున్నాడు. ఆ పక్కనే తన స్నేహితుడు అవ్‌నీష్ త్యాగి కుటుంబం తో కలసి ఉంటున్నాడు. ఇద్దరూ ఒకే చోట పనిచేస్తుండడంతో రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యం లో సంజయ్ శర్మ భార్య అవ్‌నీష్‌తో క్లోజ్‌గా ఉండేది. ఇద్దరూ బాగా మాట్లాడుకునేవారు. అవ్‌నీష్ అప్పుడప్పుడూ సంజయ్ భార్య పుట్టింటికి కూడా వెళ్తుండేవాడు.

 

 

భార్య తన స్నేహితుడితో పిచ్చాపాటి మాట్లాడుతోంది. ఆమె పుట్టింటికి అతను కూడా వెళ్తుండడంతో ఏదో జరుగుతోందని భర్తలో అనుమానం రేగింది.తన భార్యతో అవ్‌నీష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానించాడు. ఓ రోజు భార్య కరావళ్ నగర్‌లోని ఆమె పుట్టింటికి వెళ్లింది. అదే సమయంలో అవ్‌నీష్ కూడా వాళ్లింటికి వెళ్లాడు. ఇద్దరూ భార్య పుట్టింట్లో ఉన్న విషయం సంజయ్‌కి తెలిసింది. దీంతో కోపంతో రగిలిపోయిన సంజయ్ నేరుగా అత్తింటికి వెళ్లాడు. ఇద్దరూ ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నిస్తూనే తుపాకీ తీసి స్నేహితుడిని కాల్చేశాడు. బుల్లెట్ గాయాలతో అవ్‌నీష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మామ ముందే ఫ్రెండ్ తుపాకీతో కాల్చి చంపేశాడు. సమాచారం అందుకున్న కరావళ్‌నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: