కన్నబిడ్డలపై తండ్రి పైశాచికత్వం.ఇద్దర్నీ చితకబాదుతూ రాక్షసానందం. వీడియోను తల్లికి పంపి డబ్బు పంపాలంటూ బెదిరింపులు. వీడియో బయట పడింది .పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై కోపంతో కన్నబిడ్డలపట్ల కర్కశత్వంగా ప్రవర్తించాడో తండ్రి. భార్య తనతో మాట్లాడటం లేదనే కోపోంతో.. ఇద్దర్ని చిత్రహింసలు పెడుతూ వీడియో తీశాడు..


ఆ వీడియోను తన భార్యకు పంపి రాక్షసానందం పొందాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో అతడి మూర్ఖత్వం, పైశాచికత్వం బయటపడింది.పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సారవకు చెందిన ఎలీషాకు వివాహం కాగా.. ఇద్దరు ఆడపిల్లలు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో.. అతడి భార్య ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లింది. ఎలీషా మాత్రం ఇద్దరు కూతుళ్లతో కలిసి సొంత ఊరిలోనే ఉంటున్నాడు. ఏ పని చేయకుండా ఇంటి దగ్గరే ఉంటున్న ఎలీషా జులాయిగా మారాడు. భార్య ప్రతి నెలా పంపించే డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు.


భర్త ప్రతి నెలా పంపిస్తున్న డబ్బుతో జల్సాలు చేస్తున్నాడని భార్యకు తెలియడంతో.. ఆమె ఎలీషాతో మాట్లాడటం మానేసింది. కొద్ది రోజులుగా డబ్బు కూడా పంపించకపోవడంతో అతడు భార్యపై కోపం పెంచుకున్నాడు. ఆమె ఏమీ చేయలేక.. ఇద్దరు కూతుళ్లను టార్చర్ పెట్టాడు. ఇద్దరిని కొడుతూ చిత్రహింసలు పెట్టాడు. పిల్లల్ని కొడుతూ వీడియో రికార్డ్ చేసి.. తన భార్యకు పంపి డబ్బు పంపాలని బెదిరించాడు. ఇద్దరు చనిపోతామని  వీడియోలో బలవంతంగా చెప్పించాడు.


ఈ వీడియోలో సోషల్ మీడియాకు చేరడంతో.. ఎలీషా దుర్మార్గం బయటపడింది. స్థానికులు కొందరు ఇద్దరు పిల్లల్ని రక్షించగా.. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న ఎలీషా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరు పిల్లల్ని బంధువులకు అప్పగించారు. గల్ఫ్‌లో ఉన్న ఎలీషా భార్యకు సమాచారం అందించేందుకు సిద్ధమయ్యారు


మరింత సమాచారం తెలుసుకోండి: