కొండపాక మండలం ఖమ్మంపల్లిలో బావమరిది కుటుంబంపై పగతో పెట్రోల్ పోసి నిప్పంటించాడో బావ. ఈ కాలంలో ఇలాంటి బావమరుదులు ఉండడం కూడా సమాజమునకు సిగ్గుచేటు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని హుటా హుటిన సిద్ధిపేట ఏరియాలో ఉండే ఆస్పత్రికి తరలించారు. కొందరి ఆరోగ్య పరిస్థితి మరి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు. కేసును దర్యాప్తు ప్రారంభించారు.

 

 కొద్దిరోజులుగా లక్ష్మీరాజ్యం అనే వ్యక్తి తన భార్యతో ప్రతిరోజు గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో బావమరిది జాన్ రాజుకు విషయము తెలియజేశాడు. జాన్‌రాజ్ తన బావకు సర్థిచెప్పే ప్రయత్నం చేశారు. అలా సర్దిచెప్పే ప్రయత్నం వల్ల ఆ గొడవ మరింత వివాదంగా మారినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జాన్ రాజు బావమరిదిపై కక్ష పెట్టు కున్నాడు.బావ లక్ష్మీరాజ్యం.. ఆ కుటుంబం ఇంట్లో ఉన్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి ఏమీ తెలియనట్లు పారిపోయాడు.

 

బాధితులు అరుపులు విన్న అక్కడి స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు.కొందరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్ లోనిగాంధీ ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈఘటనలో గాయపడిన వారిని విమల, సునీత, జాన్‌రాజ్, రాజేశ్వరి, సునీతలుగా గుర్తించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు..

 

ఎంత కక్షలు ఉన్న కూడా ఒక కుటుంబము అంతటిని పెట్రోల్ పోసి తగల డం ఎంతో బాధాకరమైన విషయంఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. స్పాట్‌కు వెళ్లారు. కేసు నమోదు చేసి.. స్థానికుల్ని ప్రశ్నించారు.. ఈ ఘటనకు దారి తీసిన కారణాలపై ఆరా తీశారు. పరారీలో ఉన్న నిందితుడు లక్ష్మీరాజ్యం కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: