ఏంటో కలికాలమో... కాకలావికలమో ! ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ప్రపంచం అంతా వణికిపోతోంది. ఉప్పుడు కరోనా అనే ఓ చిన్న వైరస్ జనాలందరినీ వణికించేస్తోంది. అసలు ఎప్పుడు ఈ వైరస్ అంతం అవుతుందో తెలియదు కానీ దీనిపై రకరకాల కథనాలు అయితే ప్రచారంలోకి వస్తున్నాయి. ఇలా జరుగుతుందని వీర బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు. అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండగా... ఇప్పుడు కొత్తగా ఓ మైసూరు బాల మేధావి పేరు సోషల్ మీడియా, యూట్యూబ్ లో హోరెత్తిపోతోంది. అసలు ఇలా జరుగుతుందని గ్రహాల లెక్కలు పేపర్ మీద కూడా వేసి మరీ చూపించడంతో ఆ బాల మేధావి ఎప్పుడో చెప్పిన సంగతి ఇప్పుడు హైలెట్ అవుతోంది. కరోనా వైరస్ అనే పేరు చెప్పకపోయినా మిగతా అన్ని విషయాలు ఆ బాల మేధావి చెప్పినట్టుగానే జరుగుతుండడంతో ఇప్పుడు జనాల్లో నమ్మకం బాగా పెరిగిపోయింది. 

 

అన్నట్టు ఆ బాల మేధావిని మీకు పరిచయం చేయనే లేదు కదా ? ఆయన పేరు అభిజ్ఞా ఆనంద్. ఈ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే మైసూరికి చెందిన ఈ ఏక సాంద్రగ్రాహి అపార మేధావి నిండా 14 ఏళ్లు లేని ఈ అబ్బాయికి అన్ని విషయాలపైనా సమగ్రమైన పట్టు ఉంది. ఈ విషయం, ఆ విషయం అనే తేడా లేకుండా అన్ని విషయాలపైనా ప్రావీణ్యం సంపాదించేశాడు. అసలు ఇప్పుడు ఈ మేధావి గురించి ప్రస్తావన ఎందుకంటే ఇప్పటి నుంచి ఏప్రిల్ 02 వ తేదీ వరకు కరోనాకు సంబంధించి చాలా కీలకం అంటూ అభిజ్ఞా అంటున్నాడు. అసలు ఈ బాల మేధావి చెప్పినట్టుగానే దేశంలో ఈ వైరస్ ఇంక్యుబేటర్ స్థాయి అయిపొయింది.ఈ రెండు మూడు రోజులే అత్యంత కీలకం కాబోతున్నాయి. ఇప్పుడు అభిజ్ఞా చెప్పేది కూడా ఇదే.

 

 

పైన ఫోటో చూసారా ? అభిజ్ఞ లెక్కలు వేరు. ఇతర సిద్ధాంతులు చెబుతున్న లెక్కలు వేరు. ఇంతకీ ఈ బాల మేధావి ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే ...? ఏడు నెలల క్రితమే ఓ యూట్యూబ్ వీడియో వీడియో లో ఏం చెప్పాడంటే..? 2020 లో ప్రపంచంలో ఓ బయలాజికల్ వార్ జరుగుతుందని, అప్పుడు చైనా దేశమే బాగా ఇబ్బందిపడిపోతుందని,మొత్తం రవాణా అంతా ఎక్కడికక్కడ స్థంబించిపోతుందని చెప్పాడు. అయితే ఆ వీడియో కు సంబంధించి కామెంట్ బాక్స్ లో ఏం బాబు నువ్వు జోతిష్యుడివి కదా ..? కరోనా గురించి ముందే చెప్పి ఉండాలిసింది అంటూ చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. అలా అనేవారికోసం అభిజ్ఞ మరో వీడియో పెట్టాడు. దానికి దాదాపు 15 లక్షల వ్యూస్ వచ్చాయి. 

 

'నేను చెప్పిన వార్ నిజమే, ఒక వైరస్ కు ప్రపంచానికి మధ్య జరుగుతున్న వార్ ఇది. నేను చెప్పినట్టుగానే ఎక్కడికక్కడ రవాణా స్తంభించిపోయింది కరెక్టే కదా ? ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ లు ఉన్నాయి కదా ? విమాన రాకపోకలు కూడా నిలిచిపోయాయి కదా అంటూ చెబుతున్నాడు అభిజ్ఞ. మరి ఈ వైరస్ నుంచి ప్రపంచానికి ఎప్పుడు విముక్తి అని ప్రశ్నిస్తే
.. ఈ వైరస్ కు బలం చేకూర్చే గ్రహ కూటములు ఇప్పుడు చాలా ఉన్నాయ్ అని, మార్చి 29 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు చాలా కీలకమైన దశ అని, లోకానికి ఇది విషమ పరీక్ష, రెండు నెలల పాటు దీని ప్రభావం కనిపించి మే 29 వరకు ఉంటుందని, ఆ తరువాత ఈ వైరస్ అంతమైపోతుందని, అప్పుడు మన గ్రహం విముక్తి పొందుతుంది అంటూ ఈ పిల్ల జ్యోతిష్యుడు చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: