ఇది కలికాలం కాదు... కరోన కాలం... కష్టకాలం' ఇప్పుడు జనాలంతా కరోనా కంగారు లో ఉన్నారు. ఆ వైరస్ కు సంబంధించి వచ్చే ప్రతి వార్త.. ప్రతి ఒక్కరికి ఆసక్తికరమే, ఆందోళనకరమే. ప్రపంచమంతా ఈ వైరస్ ప్రభావం తో  అతలాకుతలం అవుతోంది. ఈ వైరస్ ఉద్ధృతి ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియక  నిత్యం ఆందోళనకరంగా బతుకుతున్నారు. అగ్ర రాజ్యాలుగా గొప్పలు చెప్పుకున్న దేశాలు కూడా ఇప్పుడు గజ గజలాడుతున్నాయి. ఒక వైపు మరణ మృదంగం సృష్టిస్తూ, మరోవైపు టెన్షన్ పెడుతున్న కరోనా ను కట్టడి చేసే మార్గం లేక అన్ని దేశాలు తలలు పట్టుకున్నాయి. ఇక మన దేశంలో అయితే మార్చి 25 వ తేదీ నుంచి లాక్ డౌన్ విధిస్తూ కఠినమైన నిబంధనలు రూపొందించి కరోనాను కట్టడి చేసే విధంగా దానిని అమలు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఇటువంటి విపత్కర సమయంలో బాధ్యతగా ఉండాల్సిన  పౌరులు కొంతమంది ఆకతాయితనంగా వ్యవహరిస్తున్నారు.

 

IHG

 కరోనా కు సంబంధించి ప్రజలను మరింత కంగారు పెట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలుచేస్తున్న ఈ పరిస్థితుల్లో మద్యం షాపులు తెరుస్తున్నారు.. ఇదిగో జీవో అంటూ, లాక్ డౌన్ డౌన్ ను ఎత్తివేస్తున్నారు ఇదిగో ఆధారం అంటూ... ఫలానా మతం వారి కారణంగానే ఈ కరోనా వైరస్ విజృంభిస్తోంది అని, ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయంలో దీపం కొందెక్కిందని, ఎన్నో ఎన్నెన్నో అసత్య కథనాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మానసిక ఆనందం పొందుతున్నారు. కరోనా వైరస్ పై తప్పుడు ప్రచారం చేయవద్దని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత గట్టిగా హెచ్చరికలు చేస్తున్నా ఫేక్ న్యూస్ లు మాత్రం ఆగడం లేదు. 

 

IHG

సోషల్ మీడియాలో రకరకాల మార్గాల ద్వారా ఫేక్ న్యూస్ అసలు న్యూస్ కంటే వేగంగా వైరల్ అవుతోంది. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇలా అది ఇది తేడా లేకుండా ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీని సైతం వదిలిపెట్టడం లేదు. కరోనా వైరస్ కట్టడి కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్న మన ప్రధానమంత్రి మోదీ కి ప్రజలంతా కృతజ్ఞతలు చెప్పాలి అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. దానిలో భాగంగానే ఈ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు, ఐదు నిమిషాల పాటు ప్రజలంతా ఇంటి బాల్కనీలో నిలబడి మోడీ కి సెల్యూట్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. కొంతమంది ఇదే నిజం అనుకుని పాజిటివ్ గా స్పందిస్తున్నారు. 

 

ఈ విషయం ప్రధాని నరేంద్ర మోడి వరకు వెళ్లడంతో ఇందులో నిజం లేదని, ఇదంతా సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు చేస్తున్న పని అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. కేవలం కరోనా విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ ఇదే రకంగా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిన తరువాత ప్రతి ఒక్కరూ సమాచారం పంచుకునేందుకు, తెలుసుకునేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటూ ఉండడంతో ఇటువంటి ఫేక్ న్యూస్ లు విచ్చలవిడిగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా అనేది సోషల్ న్యూసెన్స్ గా మారింది అనేది అందరి అభిప్రాయం. ఇప్పుడు సోషల్ మీడియా కాస్తా సోషల్ వైలెన్స్ గా మారి జనాలను ఇబ్బందిపెట్టేవిధంగా మారింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: