గురువింద గింజ తన నలుపు తానెరగదు అనేది తెలుగులో చాలా పాపులర్ సామెత. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబునాయుడుది కూడా అదే పద్దతిగా ఉంది చూస్తుంటే. ఇంతకీ విషయం ఏమిటంటే వైసిపి ప్రచార ప్రదర్శనలతో ప్రజారోగ్యానికి ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ కూడా రాసేశాడు. రేషన్,  ఫించన్ పంపిణి ముసుగులో ఇంటింటికి తిరుగుతూ స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారంటూ ఆరోపణలు కూడా చేశారు.

 

అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఇటువంటి ప్రచారం ఏమిటంటూ పెద్ద లా పాయింటే లేవదీశారు. సరే అధికార పార్టీ పై చంద్రబాబు, బిజెపి, సిపిఐ, జనసేన నేతలు చేస్తున్న ఆరోపణలపై వైసిపి నేతలు తిప్పి కొడుతున్నారనుకోండి అది వేరే సంగతి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైసిపి నేతలు, అభ్యర్ధులపై చంద్రబాబు ఎటువంటి ఆరోపణలైతే చేస్తున్నారో అవే పనులను టిడిపి నేతలు కూడా చేస్తున్నారు.

 

 విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, సత్యవేడు, హిందుపురం లాంటి అనేక చోట్ల టిడిపి అభ్యర్ధులు, నేతలు ఎన్నికల ప్రచారాన్నే చేసుకుంటున్నారు. నిత్యావసరాల పంపిణి పేరుతో చంద్రబాబు, బాలకృష్ణలతో పాటు కొన్ని చోట్ల అభ్యర్ధుల ఫొటోలున్న ప్యాకెట్లను పంపిణి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి టిడిపి నేతలు, అభ్యర్ధులు చేసుకుంటున్న ప్రచారం చంద్రబాబు దృష్టికి రాలేదా ? వైసిపి నేతల ప్రచారంతో ప్రాజారోగ్యానికి ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు మరి టిడిపి నేతల ప్రచారం గురించి ఏమంటారు ?

 

ప్రతిపక్షంలో ఉన్న తమ నేతలే ప్రచారం చేసుకుంటున్నపుడు అధికారంలో ఉన్న వైసిపి నేతలు మాత్రం ఎందుకు ప్రచారం చేసుకోకుండా ఉంటారన్న కనీస ఇంగితం కూడా లోపిచింది. పైగా వైసిపి నేతలు లేదా అభ్యర్ధుల నిత్యావసరాల పంపిణి, ప్రభుత్వం తరపున వెయ్యి రూపాయలు ఇస్తున్న ఫొటోలను మాత్రం ఎన్నికల కమీషన్ కు అందించటమే విచిత్రంగా ఉంది. అంటే తనకో రూలు, అధికార పార్టీకి మరో రూలుంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఏదేమైనా కిందపడినా తనదే పై చెయ్యి అన్నట్లుగా ఉంది చంద్రబాబు వ్యవహారం. ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నా సర్వ వ్యవస్ధలు తాను చెప్పినట్లే వినాలని అనుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.

 

ప్రజారోగ్యానికి ప్రమాదమంటే వైసిపి అయినా టిడిపి నేతలైనా ఒకటేగా ఉంటుంది కదా ?  నిమ్మగడ్డకు రాసిన లేఖలో తమ పార్టీ వాళ్ళ ప్రచారంపై కూడా చర్యలు తీసుకోమని ఎందుకు డిమాండ్ చేయలేదు ?  ఎన్నికల నిబంధనలు, మార్గదర్శకాలను వైసిపి నేతలే కాదు సొంతపార్టీ నేతలు కూడా ఉల్లంఘిస్తునే ఉన్నారు. తమ పార్టీ నేతలు ఉల్లంఘనలను ప్రస్తావించకుండా కేవలం వైసిపి నేతలపైన మాత్రమే ఆరోపణలు చేయటమంటే గురువింద గింజ సామెతనే గుర్తుచేస్తోంది   చంద్రబాబు ఆరోపణలు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: