`గెడ్డం గ్యాంగ్`-పేరుతో ఎల్లో మీడియా గ్యాంగ్లోని ఓ ఛానెల్లో శుక్రవారం అంతా భారీ ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. భూ కబ్జాలు, బెదిరింపు లకు పాల్పడుతున్నారని, తమ మాటవినని వారిని హతమారుస్తామంటూ బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని కూడా సదరు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వ్యవహారం అంతా కూడా కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన ఫైర్ బ్రాండ్ మంత్రి, వైసీపీ నాయకుడు కొడాలి నాని గురించే అనే విషయం చెప్పకనే తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం గమనిస్తే.. ఉద్దేశ పూర్వకంగానే మంత్రిని టార్గెట్ చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ స్టోరీలో పేర్కొన్నది ఏంటంటే.. స్థానికంగా ఉన్న గెడ్డం గ్యాంగ్ సాధారణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి.. భూములు కొల్లగొడుతున్నారని, వారిని బెదిరిస్తున్నారని, ఒప్పుకొంటే.. సరి.. లేకపోతే.. చంపేస్తామని, కేసులు కూడా ఉండవని హెచ్చరిస్తున్నారని.. అదే సమయంలో ఇప్పటికే కొన్ని ఎకరాలను ఈ గ్యాంగ్ సొంతం చేసుకుందనేది కథనం.
మొత్తంగా చూస్తే.. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక మంత్రినే టార్గెట్ చేసుకునేలా ఇక్కడి కొందరు ఎల్లో మీడియా ముఠాలు చేస్తున్న వ్యవహారంగానే పరిశీలకులు చెబుతున్నారు. నిజానికి ఏదైనా జరిగి ఉంటే.. సదరు మంత్రిపై ప్రైవేటు కేసులు పెట్టుకునే వెసులుబాటు ఎలాగూ ఉంది. అదేసమయంలో విషయాన్ని కోర్టుకు కూడాతీసుకువెళ్లొచ్చు. కానీ, ఈ కథనాల వ్యవహారం చూస్తే.. మాత్రం కేవలం విమర్శలే తప్ప పసలేని పోసుకోలు కబుర్లు మాదిరిగానే ఉన్నాయనేది వాస్తవం. నిజానికి కృష్ణాజిల్లా అంటేనే గడిచిన రెండు దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉంది.
ఎక్కడా దోపిడీలు, ముఠా కక్షలు లేవు. అదేసమయంలో బెదిరింపులు, రాజకీయ జోక్యాలు కూడా పెద్దగా కనిపించవు. అలాంటి జిల్లాలో ఒక మంత్రిపై ఇలా లేనిపోని కథనాలు వండి వార్చడం వెనుక కేవలం రాజకీయ కోణాలే తప్ప.. ఎలాంటి వ్యవహారం లేదనేది విశ్లేషకులు చెబుతున్న మాట.
పైగా గుడివాడలో నాని ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. మంత్రిగా ఉన్నారు. దీని వెనక బలమైన అరాచక శక్తులు కూడా ఉండి ఉంటాయని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. కొడాలి నాని వైసీపీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తారు. చంద్రబాబు.. టీడీపీ.. లోకేష్ మీద నాని వేసే పంచ్లు.. విరుచుకు పడే డైలాగులు ఎలా పేలతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక నాని ప్రెస్మీట్ ఉందంటే చంద్రబాబు అండ్ టీడీపీ వాళ్లు చెవులు మూసుకోవడమే. అలాంటి నానిని టార్గెట్గా చేసుకుని పచ్చ మీడియాలోని సదరు ఛానెల్కు భారీ ప్యాకేజ్ ఇచ్చి మరీ నానిని టార్గెట్గా చేయించేలా కథనాలు వండి వారుస్తున్నారని టాక్..?
ఈ విషయంలో కొడాలి నానిని టార్గెట్ చేయడం ద్వారా ఆయనతో పాటు వైసీపీ ప్రభుత్వంపైనే దుమ్మెత్తి పోయాలనే ప్రధాన ఉద్దేశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. రాజకీయంగా మంత్రి దూకుడుకు చెక్ పెట్టలేని కొందరు పనిగట్టుకుని ఇలా ఆరోపణలు చేస్తున్నారని,ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని కథనాలు కురిపిస్తున్నారని కూడా అంటున్నారు. నిజానికి ఇలాంటి వ్యవహారాల వల్ల రాజకీయంగానే కాకుండా నైతికంగా కూడా సదరు నాయకులు, ఈ కథాలను ప్రసారం చేసే చానెళ్లు కూడా బద్నాం కావడం తప్ప మరేమీ ఉండదన్నది ఆ పచ్చ మీడియా ఛానెలే తెలుసుకోవాలి.