ఆయన రూటే సపరేటు..ఎప్పుడు ఎలా ఉంటాడో ఆయనకే తెలీదు. ఇవాళ అవును అంటే రేపు కాదు అంటాడు. ఇవాళ పొగిడితే రేపు తిడతాడు. ఈ మధ్య కాలంలో అనవసరంగా ఏదోకటి మాట్లాడుతూ...ఎవరో ఒకరిని విమర్శిస్తూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయనే మెగా బ్రదర్ నాగబాబు. పవన్ కళ్యాణ్, చిరంజీవిలపై ఎవరైన కామెంట్ చేస్తే చాలు నాగబాబు వెంటనే రియాక్ట్ అవుతారు. అయితే ఇప్పుడు నాగబాబే వారిద్దరికీ పెద్ద సమస్యగా మారుతున్నాడట.

 

ఈ మధ్య అన్ని విషయాలలో తల దూరుస్తూ అటు పవన్ – చిరులకు ఇటు జనసేన పార్టీకి తలనొప్పిగా మారుతున్నాడని కొందరు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. మొన్నామధ్య గాంధీని చంపిన గాడ్సే గొప్ప దేశభక్తుడని కామెంట్ చేయడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఇరుకున పెట్టాడు. నాగబాబు కామెంట్స్ పై ఏకంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. నాగబాబు కామెంట్స్ తో జనసేనకు సంబంధం లేదని.. ఆ వ్యాఖ్యలు అతని వ్యక్తిగతం అని క్లారిటీ ఇచ్చాడు. అలాగే తాజాగా బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు ‘గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో సామాన్యుల జీవితాలు సర్వనాశనం అయిపోయాయి.. ఇన్ సైడ్ ట్రేడింగ్ తో అమరావతి ప్రాంతాన్ని మీ తెలుగుదేశం పార్టీ సర్వనాశనం చేసిందని’ విమర్శలు చేసారు.

 

దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘అప్పట్లో టీడీపీ ప్రభుత్వంతో మీ జనసేన పార్టీ కూడా కలిసి ఉంది కదా... అమరావతి రైతుల దగ్గర 33 వేల ఎకరాలు తీసుకుంటే మెగా బ్రదర్స్ ఇద్దరూ నోరు మెదపలేదని.. ఇప్పుడేమో ఏపీలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నాడని’ నెటిజన్స్ నాగబాబు మీద విమర్శలు చేస్తున్నారు. అలాగే జబర్దస్త్ ను విడుతున్న సమయంలో కూడా ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఒకానొక సమయంలో రామ్ గోపాల్ వర్మతో వివాదానికి దిగి పెద్ద రచ్చే చేశారు. అసలు నాగబాబు ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడు అనే విషయం పక్కన పెడితే..ఆయన ఏం చేసిన దాని ప్రభావం చిరు-పవన్ ల మీద పడుతుందన్న విషయం ఆయన గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: