అనగనగా తెలుగు మీడియా రంగంలో ఒక ప్రధాన మీడియా. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా అని కూడా పలువురు అభివర్ణిస్తూ ఉంటారు. ఆ మీడియా సంస్థల అధినేత మాటలు వింటుంటే కోటలు దాటి పోతుంటాయి. ఈ ప్రపంచానికి దేవుడినని తాను... నేను చెప్పిందే వేదం అని నీతులు చెప్పటం లో ఆరితేరి పోయిన వ్యక్తి సదరు మీడియా అధినేత. గత 15 ఏళ్లుగా ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ తన పత్రిక నిర్వహణ కోసం అనేక కుయుక్తులు వేసుకుని కాలం గడుపుతూ వచ్చారు. అయితే ఇప్పుడు సదరు పత్రిక అధినేత ఆయన కెరీర్లో ఎప్పుడూ ఎదుర్కొని ఒక తీవ్రమైన సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు.
చంద్రబాబు కోసం తెలంగాణలో సీఎం కేసీఆర్ తో సున్నం పెట్టుకుని పూర్తిగా దూరం అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ మాత్రం ఆయన్ను దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు. గతంలో వీరిద్దరూ ఏరా అంటే ఒరేయ్ అనుకునేంత స్నేహం చేసిన వాళ్లే. అయితే సదరు పత్రిక అధినేత దొంగాటను పూర్తిగా గమనించిన కెసిఆర్ పూర్తిగా దూరం పెట్టేశారు. ఏపీలో సీఎం జగన్ను రాజకీయంగా అణగదొక్కేందుకు సదరు పత్రిక అధినేత టిడిపి అధికారంలో ఉండగా ఎన్నో డబుల్ గేమ్ లు ఆడాడు. అంతేకాకుండా వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అప్పట్లో అధికార టిడిపిలో చేరేందుకు బ్రోకర్ గా మారిపోయారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి.
ఇక ఇప్పుడు సదరు మీడియా సంస్థల నుంచి చీమ చిటుక్కుమన్నా కూడా వైసీపీ కీలక నేతలకు వెళ్లిపోతోందట. ఇంతకు మ్యాటర్ ఏంటంటే సదరు సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఇప్పుడు వైసీపీ, జగన్ కు వీరాభిమానులు అయిపోయారట. తమ ఎండీ సుద్ద నీతులు చెపుతూ వందల మంది ఉద్యోగులను పీకి పడేస్తూ.. మరో వైపు ఉన్న వాళ్లకు కూడా భారీగా జీతాలు కట్ చేయడంతో పాటు నానా హింసలు పెడుతున్నారని వారంతా వాపోతున్నారు. ఇప్పుడు అక్కడ పై స్థాయిలో ఉన్న కీలక ఉద్యోగులే తమ ఎండీ తీరుతో తీవ్రంగా విసిగిపోయి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారట. దీంతో ఆ సంస్థలో ఏం జరిగినా కూడా వైసీపీ అధిష్టానానికి వెంటనే చేరిపోతోందట. అందుకే వైసీపీకి చెందిన ఓ కీలక నేత సదరు మీడియా సంస్థ అధినేతను ఎంతో ప్రేమతో బూతు కిట్టు అని పిలుచుకుంటూ సోషల్ మీడియా టార్గెట్గా ఓ ఆటాడుకుంటూ ఉంటారు.