లేని దాని కోసం ఆరాటపడితే ఉన్నది కూడా పోతుంది అనే ఒక సామెత ఉంది కదా.. అది ఇప్పుడు నేను చెప్పబోయే యదార్ధ గాధలోని మహిళకి కరెక్టుగా సరిపోతుంది. అపురూపంగా చూసుకునే భర్త.. చక్కనైన పిల్లలతో ఆమె జీవితం ఎంతో చూడముచ్చటగా ఉంది. కానీ, ఈ అందమైన జీవితం ఆమెకు నచ్చలేదేమో, తప్పటడుగులు వేసి.. తన చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుని ఇప్పుడు ఒంటరిగా మారింది. అసలు ఆమె చేసిన అంత దారుణమైన పనేంటో ఇప్పుడు చూద్దాం..

 

తమిళనాడుకు చెందిన డిగ్రీ పూర్తి చేసుకున్న ఒక మహిళ(29)ను ఒక కుర్రాడు ఇష్టపడి కట్నకానుకలు తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.. దాదాపు 10 సంవత్సరాల పాటు వీరి దాంపత్యం సాఫీగా సాగింది. ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న క్రమంలో ఆ మహిళకు ఏడాదిన్నర క్రితం 24 సంవత్సరాల యువకుడి నుంచి మిస్డ్‌ కాల్ వచ్చింది. దీంతో ఆమె జీవితమంతా తలకిందులుగా మారింది. ఆ మిస్డ్‌ కాల్ యువకుడితో పరిచయం కాస్తా స్నేహంగా మారి ప్రేమకు దారితీసింది. అయితే యువకుడిపై మనసుపడ్డ ఆ యువతి తనకు పెళ్ళయిన విషయం అతని చెప్పకుండా దాచిపెట్టింది. అతనితో బయటకి వెళ్ళినప్పుడు కూడా తన పెళ్లి విషయం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంది.

 

ప్రేమలో చివరి అంచులకు చేరిన వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో సదరు మహిళ జూన్ 20వ తేదీన ఓ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తున్నట్లు భర్తకు చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోయి.. ఆ యువకుడి బంధువుల సమక్షంలో 24వ తేదీన అతడిని పెళ్లి చేసుకుంది. అయితే నాలుగు రోజులు గడుస్తున్నా భార్య ఇంటికి రాకపోవడం, ఫోన్ ఎత్తకపోవడంతో ఆమె భర్త సేరన్ మహాదేవి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పైగా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఫోటోను ఆమె వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకుంది. దాన్ని చూసి షాక్ తిన్న భర్త ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశాడు.దీంతో పోలీసులు ఆమెతో పాటు తాజా భర్తను వెతికి పట్టుకుని విచారించారు. ఈ సందర్భంగా తనకు పదేళ్ల క్రితం పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఆమె చెప్పడంతో యువకుడు కంగుతిన్నాడు.

 

తనని ఇంత మోసం చేసిన ఆ యువతితో కాపురం చేయనని తెగేసి చెప్పి వెళ్ళిపోయాడు.. అలాగే ఇంత నీచానికి పాల్పడిన భార్య ను చేరదీసేందుకు ఆమె మొదటి భర్త కూడా నిరాకరించాడు. దీంతో ఆమె జీవితం అటూ.. ఇటూ.. కాకుండా మధ్యలోనే ఆగిపోయింది. భర్త, పిల్లలతో హాయిగా సంసారం జీవితం అనుభవిస్తూ.. పరాయి వ్యక్తి మోజులో పడిన ఆమె ఇప్పుడు అందరికీ దూరమై దుర్భరంగా జీవిస్తుండటం చాలామందికి గుణపాఠంగా మారింది. నిజానికి దేశంలో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఒకరి మోజులో పడి తమ దాంపత్య జీవితాన్ని నాశనం చేసుకుంటున్న ఇలాంటి మహిళలు ఎందరో ఉన్నారు. ఇకనైనా ఇలాంటి ఆలోచనలు మాని.. కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ.. దాంపత్య జీవితానికి విలువనిస్తే జీవితం ఆనందంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: